Rapist Jalebi Baba : బాబోయ్.. ఈ జిలేబీ బాబా మామూలోడు కాదు, ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం

బాబా ముసుగులో దారుణాలకు ఒడిగట్టాడు. కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు ఒడిగట్టాడు. బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి కామ వాంఛలు తీర్చుకున్నాడు. పది మంది 20 మంది కాదు.. ఏకంగా 120 మంది మహిళలను అత్యాచారం చేశాడు. చివరికి ఆ కీచక బాబా పాపం పండింది. కటకటాల పాలయ్యాడు.

Rapist Jalebi Baba : నుదుట బొట్టు. మెడలో రుద్రాక్ష మాల. చూడటానికి అచ్చం బాబాలానే ఉన్నాడు. ఇంకేముంది.. నేను బాబానంటూ ప్రచారం చేసుకున్నాడు. మాయ మాటలతో జనాలకు దగ్గరయ్యాడు. కట్ చేస్తే.. వాడు మనిషి కాదు మృగం అని బయటపడింది. బాబా ముసుగులో దారుణాలకు ఒడిగట్టాడు. కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు ఒడిగట్టాడు. బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి కామ వాంఛలు తీర్చుకున్నాడు. పది మంది 20 మంది కాదు.. ఏకంగా 120 మంది మహిళలను అత్యాచారం చేశాడు. చివరికి ఆ కీచక బాబా పాపం పండింది. కటకటాల పాలయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. హర్యానాలో అమర్ పురి అలియాస్ బిల్లూ (63) అనే కీచకుడు 120 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్టు కోర్టులో రుజువైంది. ఫతేహాబాద్ జిల్లా తొహానా పట్టణానికి చెందిన అమర్ వీర్ కీచక బాబా. అతడిని అందరూ జిలేబీ బాబా అని పిలుస్తారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడటమే కాదు ఈ నీచుడు.. తన అఘాయిత్యాలను వీడియో తీసి, వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ పదేపదే అత్యాచారాలకు పాల్పడేవాడని కోర్టు గుర్తించింది.

Also Read..VBIT Photos Morphing Case : VBIT కాలేజీ అమ్మాయిల ఫోటోల మార్ఫింగ్ కేసులో పురోగతి.. ఆ నలుగురు అరెస్ట్

అత్యాచారానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ కావడంతో జిలేబీ బాబాను పోలీసులు 2019 జులై 19న అరెస్ట్ చేశారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. కీచక బాబా దారుణాలు బట్టబయలయ్యాయి. ఏకంగా 120 వీడియో క్లిప్పింగ్ లు బయటపడ్డాయి. అతడు తన మొబైల్ ఫోన్ తో అత్యాచారకాండను వీడియో తీసేవాడని పోలీసులు తెలిపారు.

విచారణలో పోలీసులు అమర్ పురి అలియాస్ బిల్లూ గురించి వివరాలు తెలుసుకున్నారు. అమర్ వీర్ కుటుంబం గురించి ఎంక్వైరీ చేశారు. అతడికి నలుగురు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్య చనిపోయింది. 23 ఏళ్ల కిందట పంజాబ్ లోని మాన్సా పట్టణం నుంచి హర్యానాలోని తొహానా వలస వచ్చాడు. 13 ఏళ్ల పాటు అతడు ఓ జిలేబీ దుకాణం నడిపాడు. ఆ సమయంలో ఓ తాంత్రికుడితో పరిచయం అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. క్షుద్రపూజలపై ఆసక్తి చూపాడు.

ఆ తర్వాత ఎవరికీ కనిపించకుండా పోయాడు. కొన్నాళ్ల తర్వాత తిరిగొచ్చాడు. ఓ ఆలయం పక్కనే ఇల్లు కట్టుకున్నాడు. అది మొదలు.. తనను తాను బాబాగా చెప్పుకోవడం స్టార్ట్ చేశాడు. ఈ క్రమంలో పలువురు భక్తులను తయారు చేసుకున్నాడు. వారిలో చాలామంది మహిళలు ఉన్నారు.

Also Read..Lover Cut Girlfriend’s Throat : పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతు కోసిన ప్రేమోన్మాది

భక్తుల్లో నమ్మకం ఏర్పరచుకున్న తర్వాత.. జిలేబీ బాబా తన అసలు రూపం బయటపెట్టాడు. అత్యాచారాలకు ఒడిగట్టాడు. 2018లో ఓ పరిచయస్తుడి భార్యపై గుడిలో అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అయితే ఈ కేసులో అతడికి బెయిల్ లభించింది. ఆ తర్వాత బాబా అత్యాచారానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ కీచక బాబా పాపం పండింది. నేరాలు నిరూపితం కావడంతో జిలేబీ బాబాకు శిక్ష విధించనుంది కోర్టు.

” మాకు లభించిన క్లిప్పింగ్‌లలో లైంగిక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తి జిలేబీ బాబా అని గుర్తించాయి. బాధిత మహిళల్లో ఇద్దరు ఇప్పటికే మా ముందుకు వచ్చారు. మొబైల్ ఫోన్ సాయంతో అన్ని అఘాయిత్యాలను బాబా వీడియో తీశాడు” అని పోలీసులు వెల్లడించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

”కీచక బాబా దగ్గరకు ఎక్కువగా మహిళలే వచ్చే వారు. వారిలో చాలా మంది దెయ్యాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకునేందుకు బాబా వద్దకు వచ్చేవారని పోలీసుల విచారణలో తేలింది. “నిందితుడు తాంత్రికుడు. తన వద్దకు వచ్చిన మహిళలకు మాయమాటలు చెప్పి ద్రవం రూపంలో డ్రగ్స్ ఇచ్చే వాడు. వాళ్లు మత్తులో జారుకున్నాక లైంగిక దాడికి పాల్పడేవాడు. అదంతా వీడియో తీసి వాటి ద్వారా బాధితులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు దండుకునే వాడు” అని పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు