Realtor Kidnap : హైదరాబాద్ కింగ్కోఠీలోని ఈడెన్ గార్డెన్ వద్ద నిన్న అర్ధరాత్రి కిడ్నాప్కు గురైన రియల్టర్ షేక్ గుయోష్ పాషా ఆచూకి లభ్యం అయ్యింది. ఈరోజు ఉదయం పాషా తన కుమార్తె సానాకు ఫోన్ చేసి మాట్లాడాడు.
తను మొయినాబాద్ లో ఉన్నానని… ఒక గంట.. గంటన్నరలో ఇంటికి వస్తాను కంగారుపడకండి అని చెప్పినట్లు తెలిసింది. ఈ విషయాన్ని పాషా అల్లుడు పోలీసులకు తెలియచేశాడు. పోలీసులు వెంటనే సాంకేతిక సహాయంతో పాషా ఫోన్ సిగ్నల్స్ ను ట్రేస్ చేశారు.
Also Read : TDP Leader Vinod Jain : వేధించాను…కానీ ఇంతదాకా వస్తుందని అనుకోలేదు
మొయనా బాద్ పరిసరాలలో అతని సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉన్నట్లు గుర్తించారు. సెంట్రల్ టాస్క్ జోన్ ఫోర్స్ పోలీసులు పాషాను తీసుకవచ్చేందుకు మొయినాబాద్ బయలు దేరి వెళ్లారు.