TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరు అరెస్టు.. ప్రశ్నాపత్రం కొనుగోలుకు రూ.10 లక్షల ఒప్పందం

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరిని సిట్ అరెస్టు చేసింది. షాద్ నగర్ పరిధిలోని నేరేళ్లచెరువుకు చెందిన రాజేంద్రకుమార్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పేపర్ లీకేజీ కేసులో అరెస్టు అయిన నిందితుల సంఖ్య 14కు చేరింది.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. సిట్ విచారణలో రోజు రోజూ కొత్త కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తీగను లాగితే డొంక కదిలిన చందంగా తవ్వే కొద్దే సంచలన విషయాలు బయటకువస్తూనేవున్నాయి. ఈ కేసులో నిందితులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నారు. సిట్ అధికారులు వరుసగా నిందితులను అరెస్టు చేస్తోంది. ఇప్పటివరకు 13 నిందితులను సిట్ అధికారులు అరెస్టు చేసి, విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసులో మరొకరిని సిట్ అరెస్టు చేసింది.

షాద్ నగర్ పరిధిలోని నేరేళ్లచెరువుకు చెందిన రాజేంద్రకుమార్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పేపర్ లీకేజీ కేసులో అరెస్టు అయిన నిందితుల సంఖ్య 14కు చేరింది. ప్రశ్నాపత్రం కొనుగోలుకు రూ.10 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా రాజేంద్రకుమార్ రూ.5 లక్షల అడ్వాన్స్ చెల్లించారు. శనివారం పేపర్ లీకేజీ కేసులో మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్ పేట్ ఉపాధి హామీ (ఈసీ) అధికారి ప్రశాంత్‌ సిట్ అరెస్ట్ చేసింది. ప్రశాంత్ పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాశారు. కాగా, TSPSC పేపర్ లీకేజ్ కేసులో సిట్ మరోసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు.. నిందితుల రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు

ఏ -1 ప్రవీణ్, ఏ -2 రాజశేఖర్, ఏ -4 డాక్య, ఏ -5 కేతావత్ రాజేశ్వర్, ఏ-10 షమీమ్, ఏ -11, సురేష్, ఏ -12 రమేష్ లను ఆరు రోజుల కస్టడీ కోరింది. సిట్ కస్టడీ పిటిషన్ ఫై శనివారం విచారణ జరుపిన నాంపల్లి కోర్టు నలుగురు నిందితులను కస్టడీకి అనుమతించింది. ఏ -1 ప్రవీణ్, ఏ -2 రాజశేఖర్, ఏ -4 డాక్య, ఏ -5 కేతావత్ రాజేశ్వర్ లను కస్టడీకి కోర్టు అనుమతించింది. మూడు రోజుల కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నలుగురు నిందులను మూడు రోజులపాటు సిట్ అధికారులు విచారించనున్నారు. ఆదివారం నలుగురు నిందితులను సిట్ అధికారులు కస్టడీలో తీసుకోనున్నారు.

మిగిలిన ముగ్గురు నిందితులు షమీమ్, సురేశ్, నరేశ్ కస్టడీ పిటిషన్ పై విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు పేపర్ లీకేజీ కేసులో నిందితుల కస్టడి రిపోర్టును సిట్ వెల్లడించింది. తొలిసారి కస్టడీలో నిందితులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పేపర్ లీకేజీ కేసులో అరెస్టు అయిన నిందితులు సమాచారం ఇవ్వలేదని సిట్ పేర్కొంది. పేపర్ లీకేజీ లో జరిగిన చైన్ ప్రాసెస్ పై నిందితులు నోరు మెదపలేదు. నిందితులు కేవలం ముగ్గురి పేర్లను మాత్రమే చెప్పారు.

TSPSC paper leak: పేపర్ లీక్ నిందితులు రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్ సస్పెన్షన్

అంతకముందు 12 మంది నిందితులను సిట్ అధికారులు ఆరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. 12 మంది రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. తొమ్మిది మంది నిందితులతో పాటు శుక్రవారం మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చేశారు. ఈ ముగ్గురిలో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటివరకు నలుగురు టీఎస్పీఎస్సీ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. A-1 ప్రవీణ్ TSPSC సెక్రెటరీ పీఏ, A-2 రాజశేఖర్, నెట్వర్క్ అడ్మిన్, A-10 షమీమ్ ASO, A-12 రాజశేఖర్ డాటా ఎంట్రీ ఆపరేటర్ గా పని చేస్తున్నారు.

నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఈ కేసులో 19 మంది సాక్ష్యులను విచారించినట్టు రిమాండ్ రిపోర్ట్ లో సిట్ అధికారులు వెల్లడించారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగి శంకర్ లక్ష్మిని ప్రధాన సాక్షిగా పేర్కొన్నారు. శంకర్ లక్ష్మితో పాటు టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ టెక్నీకల్ సర్వీస్ ఉద్యోగులను సాక్షులుగా వెల్లడించారు. కర్మన్ ఘాట్ లోని ఒక హోటల్ లోని యాజమని, ఉద్యోగిని సాక్షిగా పేర్కొన్నారు. హోటల్ లోని సీసీటీవి కెమెరాలో పేపర్ ఎక్సెంజ్ వ్యవహారం నిక్షిప్తమైంది.

Governor Tamilisai Soundararajan : TSPSC పేపర్ లీక్ కేసు.. గవర్నర్ సీరియస్, హాట్ కామెంట్స్

ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేశ్, సురేశ్ లను సిట్ అధికారులు ఆరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితుల నుండి ఒక ల్యాప్ టాప్ మూడు మొబైల్ ఫోన్స్ స్వాదినం చేసుకున్నారు. గ్రూప్-1లో 127 మార్కులు వచ్చిన షమీమ్ అనే నిందితుడు, 122 మార్కులు సాధించిన మరో నిందితుడు రమేశ్ సహా సురేశ్ అనే మరో నిందితుడిని పోలీసులు గురువారం అరెస్టు చేసి, నాంపల్లి కోర్టులో హాజరుపర్చగా వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను కోర్టు ఆదేశాలతో చంచల్ గూడ జైలుకి తరలించారు.

రమేశ్, సురేశ్, షమీమ్ ఏప్రిల్ 6 వరకు(14 రోజులు) రిమాండ్ లో ఉండనున్నారు. టీఎస్పీఎస్సీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా రమేశ్ పని చేస్తున్నాడు. అలాగే, షమీమ్ 2013లో గ్రూప్-2 ఉద్యోగం పొందాడు. రాజశేఖర్ నుంచి అతడు గ్రూప్-1 ప్రశ్నాపత్రం తీసుకున్నాడు. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని తను రాజశేఖర్ ఇచ్చినట్లు అధికారుల ముందు షమీమ్ ఒప్పకున్నాడు. మరోవైపు ఎన్నారైలు కూడా పరీక్షలు రాశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు