Pakistan : పాకిస్థాన్ లో చైనీయులపై దాడులు కొనసాగుతున్నాయి. గత నెలలో ఖైబర్-ఫంక్తువా ప్రోవిన్స్ లో ఆత్మహుతి దాడి జరగ్గా.. 9 మంది మృతి చెందారు. వీరిలో చైనీయులు 5గురు ఉన్నారు. మిగిలిన నలుగురు పాకిస్థాన్ పౌరులు. ఇక శుక్రవారం సాయంత్రం మరోసారి ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు మృతిచెందినట్లు, ముగ్గురు గాయపడినట్లు సమాచారం. ఈస్ట్ బే రోడ్డులో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో చైనీయులతో వెళ్తున్న ఓ కారుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఆత్మహుతి దాడిని పాకిస్థాన్ ఖండించింది. ఘటన సమాచారం అందగానే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు బెలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఈ ఘటనలో 9 మంది చైనా పౌరులు మృతి చెందినట్లు బెలూచిస్థాన్ పోస్ట్ మరోలా కథనం ప్రచురించింది.
బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణం పూర్తి కాకుండా అడ్డుకుంటామని ఎప్పటి నుంచో చెప్తోంది కూడా. చైనాలో మైనారిటీ వర్గం ఉయిగుర్ల ఉచకోత ఘటనలకు ప్రతీకారంగానే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నట్లు బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేసింది.
Strongly condemn suicide attack on Chinese nationals Vehicle in #Gwadar.
2 children died who were playing nearby & one Chinese sustained minor injuries.
3 persons injured including driver
Police & CTD teams are on the crime scene.
Investiga launched.Innocent Children,Afsos
— Liaquat Shahwani (@LiaquatShahwani) August 20, 2021