Pakistan : పాకిస్థాన్ లో చైనీయులపై ఆత్మహుతి దాడి

పాకిస్థాన్ లో చైనీయులపై దాడులు కొనసాగుతున్నాయి. శుక్రవారం మరోసారి చైనీయులే టార్గెట్ గా ఆత్మహుతి దాడి జరిగింది

Pakistan : పాకిస్థాన్ లో చైనీయులపై దాడులు కొనసాగుతున్నాయి. గత నెలలో ఖైబర్‌-ఫంక్తువా ప్రోవిన్స్‌ లో ఆత్మహుతి దాడి జరగ్గా.. 9 మంది మృతి చెందారు. వీరిలో చైనీయులు 5గురు ఉన్నారు. మిగిలిన నలుగురు పాకిస్థాన్ పౌరులు. ఇక శుక్రవారం సాయంత్రం మరోసారి ఆత్మహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు మృతిచెందినట్లు, ముగ్గురు గాయపడినట్లు సమాచారం. ఈస్ట్ బే రోడ్డులో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో చైనీయులతో వెళ్తున్న ఓ కారుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.

ఈ ఆత్మహుతి దాడిని పాకిస్థాన్ ఖండించింది. ఘటన సమాచారం అందగానే క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు బెలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ఈ ఘటనలో 9 మంది చైనా పౌరులు మృతి చెందినట్లు బెలూచిస్థాన్ పోస్ట్ మరోలా కథనం ప్రచురించింది.

బెలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. చైనా-పాక్‌ ఎకనమిక్‌ కారిడార్‌ నిర్మాణం పూర్తి కాకుండా అడ్డుకుంటామని ఎప్పటి నుంచో చెప్తోంది కూడా. చైనాలో మైనారిటీ వర్గం ఉయిగుర్ల ఉచకోత ఘటనలకు ప్రతీకారంగానే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నట్లు బెలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ స్పష్టం చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు