Acharya: మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిన సినిమా ‘ఆచార్య’. ఈ సినిమాకు సంబంధించి కొత్త రిలీజ్ డేట్ను నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఆచార్య సినిమాని ఏప్రిల్ 29వ తేదీన విడుదల చేయనున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాని ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని నిర్మాణ సంస్థలు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటైర్టైన్మెంట్ ప్రకటించాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాని మార్చి 25వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించిన కాసేపటికే ఆచార్యకు సంబంధించిన అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.
కోవిడ్ పరిస్థితులు ఈ నెలాఖరు వరకు కంట్రోల్లోకి వస్తాయనే ఆలోచనతో ఈసినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి నిర్మాణ సంస్థలు. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ సందడి చేస్తుందని అందరూ భావించినా కుదరలేదు.
ఇక ‘ఆచార్య’, ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్లను అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు మహేష్ అభిమానుల్లో కొత్త అనుమానాలు నెలకొన్నాయి. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ ఏప్రిల్ 1న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.
#AcharyaOnApr29 ❤️?
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma @MatineeEnt @KonidelaPro pic.twitter.com/NYy8UFFVG6
— Konidela Pro Company (@KonidelaPro) January 31, 2022