Hyderabad Metro : మెట్రో సువర్ణ ఆఫర్-2021 విజేతల ప్రకటన

మెట్రో సువర్ణ ఆఫర్-2021 విజేతలను హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. ప్రయాణికుల టికెట్ల నుంచి లక్కీ డ్రా తీసి.. మెట్రో బహుమతులు ఇస్తోంది.

Metro suvarna Offer-2021 : మెట్రో సువర్ణ ఆఫర్-2021 విజేతలను హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. ప్రయాణికుల టికెట్ల నుంచి లక్కీ డ్రా తీసి.. మెట్రో బహుమతులు ఇస్తోంది. నెలవారీ లక్కీ డ్రా కింద బహుమతులు ప్రదానం చేసింది. అమీర్ పేట్ స్టేషన్ లో బహుమతులు ప్రదానం చేసింది.

కోవిడ్ తర్వాత రోజూ 2.30 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని మెట్రో ఎండీ తెలిపారు. కోవిడ్ కు ముందు 4 లక్షల మందికి పైగా ప్రయాణించేవారని పేర్కొన్నారు. భవిష్యత్ లో 4 లక్షల మంది ప్రయాణికుల సంఖ్యను చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు