KTR: అటువంటి వ్యక్తిని ఎమ్మెల్సీగా గెలిపిస్తారా?: కేటీఆర్

ప్రభుత్వం ఇస్తానని చెప్పిన 2 లక్షల ఉద్యోగాల గురించి రాకేశ్ రెడ్డి పోరాడతారని కేటీఆర్ అన్నారు.

‘‘పట్టభద్రుల తరఫున మీరు పట్టం కట్టే వ్యక్తి బ్లాక్మెయిల్ రాజకీయాలు, బూతు పురాణం మాట్లాడే వ్యక్తి ఉండాలా? మీరే నిర్ణయించుకోండి’’ అని ప్రజలకు చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ అభ్యర్థిపై విమర్శలు గుప్పించారు.

శాసనమండలికి నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రచారంలో భాగంగా ఖమ్మం ఎస్బీఐటీ కాలేజీలో జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు. ప్రశ్నించే గొంతు శాసనమండలిలో ఉండాలని, అది రాకేశ్ రెడ్డితోనే సాధ్యమని కేటీఆర్ చెప్పారు.

ప్రభుత్వం ఇస్తానని చెప్పిన 2 లక్షల ఉద్యోగాల గురించి రాకేశ్ రెడ్డి పోరాడతారని కేటీఆర్ అన్నారు. సమాజంలో మంచికంటే చెడు ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని చెప్పారు. సోషల్ మీడియాలో మంచి మాటలు చెప్పే రాకేశ్ రెడ్డి లాంటి వ్యక్తి మాటలు ఎవరు చూడరని, తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి బూతులు మాట్లాడితే ఎక్కువ మంది చూస్తారని అన్నారు.

రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కనీసం ఒక్క నోటిఫికేషన్ అయిన ఇచ్చారా? అని కేటీఆర్ అడిగారు. రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని గల్లాపట్టి అడిగే వ్యక్తి రాకేశ్ రెడ్డి అని అన్నారు.

తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు

ట్రెండింగ్ వార్తలు