కౌంట్ డౌన్ మొదలైంది..! కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా కేటీఆర్ ఫైర్..

నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు. కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

KTR and Revanth Reddy

KTR : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ట్విటర్ వేదికగా ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసం.. దగా.. నయవంచన.. అంటూ విరుచుకుపడ్డారు. గ్యారెంటీ కార్డులో వరిపంటకు రూ. 500 బోనస్ అని కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కుతారా? ప్రచారంలో ప్రతిగింజకు అని ఊదరగొట్టి.. ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు.. వివరాలు తెలిపిన మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు

నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు. కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రతియేటా రైతులు, కౌలు రైతులకు రూ. 15వేలు రైతు భరోసా అన్నారు.. ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు రూ. 12వేలు అన్నారు.. వేయలేదు. ప్రతిరైతుకు డిసెంబర్ 9నే రెండు లక్షల రుణమాఫీ అన్నారు.. చేయలేదు. నేడు బోనస్ విషయంలోకూడా ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయటపెట్టారు. ఓట్ల నాడు ఒకమాట.. నాట్ల నాడు మరొకమాట చెప్పడమే కాంగ్రెస్ నైజం అంటూ కేటీఆర్ విమర్శించారు.

Also Read : తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ ఎవరు? అధ్యక్ష పదవి రేసులో ఉన్నది ఎవరెవరు?

అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో కాంగ్రెస్ పార్టీ గారడీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని కాంగ్రెస్ సర్కార్ బటపెట్టిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎద్దేడ్చిన యపుసం.. రైతేడ్చిన రాజ్యం నిలబడదు. నమ్మి ఓటేసినందుకు రైతుల గొంతుకోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరు. పల్లెపల్లెనా ప్రశ్నిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు. కపట కాంగ్రెస్ పై సమరశంఖం పూరిస్తారు. నేటి నుంచి రైతన్నల చేతిలోనే కాంగ్రెస్ సర్కార్ కు కౌంట్ డౌన్ షురూ అయిందంటూ కేటీఆర్ అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు