Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడుస్తుండగా తెలుగు సినిమాలతో ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగేందుకు కృషి చేస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో జానకి పాత్రతో పాటు నాలుగైదు హిందీ సినిమాలలో కూడా నటిస్తుంది. స్టార్ స్టేటస్ అంటే ఊరికే రాదు కదా అందుకే లావిష్ ఏరియాలో మంచి ఇల్లు చూసి దిగిపోయింది ఢిల్లీ సుందరి. ఆ ఇల్లు ఎవరిదో కాదు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ది కావడం గమనార్హం.
Kapil Biopic 83: రణవీర్, దీపికాకు షాక్.. నిర్మాతలపై చీటింగ్ కేస్!
ముంబై సౌత్ అంధేరిలో అమితాబ్ ఈమధ్యనే ఓ డుప్లెక్స్ ప్లాటును కొన్నారు. దాన్ని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించగా అనేక మంది సెలబ్రిటీలు ఆ ఇల్లు కోసం ప్రయత్నించగా చివరకు అది కృతి సనన్కి దక్కింది. ఈ డూప్లెక్స్ ప్లాట్ అద్దె నెలకు రూ.10 లక్షలు కాగా.. సెక్యూరిటీ డిపాజిట్ రూ.60 లక్షలు. ఇప్పటికే డిపాజిట్ కట్టేసిన కృతి మూడేళ్ళ పాటు ఆ ఇంట్లో ఉండేవిధంగా అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. రూ.31 కోట్లతో ఈ ఏడాదే ఈ డుప్లెక్స్ కొన్న అమితాబ్ అక్టోబర్ లోనే కృతికి అగ్రిమెంట్స్ చేసుకున్నారట. దీంతో ఈ వార్త ఇప్పుడు బీ టౌన్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Pushpa- Samantha: దీపాలన్నీ ఆర్పేశాక.. ఊ.. ఊఊ.. సామ్ స్పెషల్ ట్రీట్! పాట విడుదల
నాలుగు దశాబ్దాలపైనే ఇండస్ట్రీలో ఉన్న అమితాబ్ ముంబైలో ఆస్తులు కూడా బాగానే సంపాదించారు. జూహూలో ఉన్న వత్స, అమ్ము అనే బంగ్లాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అద్దెకు తీసుకోగా నెలకు రూ.18.90 లక్షల అద్దెను చెల్లిస్తున్నారు. పదిహేనేళ్ల పాటు అగ్రిమెంట్ చేసుకున్న ఎస్బీఐ ప్రతి ఐదు సంవత్సరాలకు 25 శాతం అద్దె పెంచేలా నిబంధన చేసుకున్నారు. ఈ బంగ్లాల విలువ సుమారుగా రూ.200 కోట్లకు పై మాటే. ఇవే కాకుండా ఆయన నివాసం ఉండే బంగ్లాతో పాటు మరో రెండు ఇల్లు కూడా ఆయన సొంతం.