Pawan Kalyan : ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా కెటిఆర్

'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరు గెస్ట్ గా వస్తారు అని అంతా ఆలోచిస్తున్నారు. ఈ సారి ఎవరూ ఊహించని పేరు వినిపిస్తుంది. సినీ పరిశ్రమ నుంచి కాకుండా రాజకీయాల నుంచి..........

Pawan Kalyan :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాతో కలిసి చేసిన మల్టీస్టారర్ ‘భీమ్లా నాయక్’ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వబోతుంది. ఇందులో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాయగా సాగర్ చంద్ర తెరకెక్కించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మించింది. ఫిబ్రవరి 25న ‘భీమ్లా నాయక్’ సినిమా థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవ్వబోతుంది.

ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్, మాస్ క్యారెక్టర్ చేయడం, సాంగ్స్ కూడా వైరల్ అవ్వడం, మలయాళం హిట్ సినిమా రీమేక్ కావడంతో పవన్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయనున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా త్వరలోనే నిర్వహించనున్నారు.

Bheemla Nayak: భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫిబ్రవరి 25నే వచ్చేస్తోంది

అయితే ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరు గెస్ట్ గా వస్తారు అని అంతా ఆలోచిస్తున్నారు. ఈ సారి ఎవరూ ఊహించని పేరు వినిపిస్తుంది. సినీ పరిశ్రమ నుంచి కాకుండా రాజకీయాల నుంచి ఈ సారి స్పెషల్ గెస్ట్ రాబోతున్నట్టు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తెలంగాణ మంత్రి, కెసిఆర్ తనయుడు కెటిఆర్ ముఖ్య అతిథిగా రానున్నారని సమాచారం.

Pawan Kalyan : అమెరికాలో 400కి పైగా థియేటర్లలో ‘భీమ్లా నాయక్’ విడుదల

కెటిఆర్ గతంలో కూడా కొన్ని సినిమా ఫంక్షన్స్ కి గెస్ట్ గా వచ్చారు. తాజాగా ‘భీమ్లా నాయక్’ సినిమాకి ముఖ్య అతిధిగా రానున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు