Manoj Manchu-Bhuma Mounika: బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(Om Raut) దర్శకత్వంలో రాముడిగా ప్రభాస్(Prabhas) కనిపించనున్న చిత్రం ‘ఆదిపురుష్’. సీతగా కృతిసనన్(Kriti Sanon), రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్(Saif Alikhan) నటిస్తున్న ఈ సినిమా జూన్ 16 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను నిరుపేదలు, అనాథలు సైతం చూడాలన్న ఉద్దేశ్యంతో పలువురు ప్రముఖులు ఈ సినిమా టికెట్లను కొని ప్రత్యేక షోలు వేయించేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నిర్మాత అభిషేక్ అగర్వాల్ 10వేల టికెట్లు కొనుగోలు చేసినట్లు ప్రకటించారు.
Adipurush : హనుమంతుడి పక్క సీటు రేటుపై క్లారిటీ ఇచ్చిన మూవీ టీమ్.. ఎంతో తెలుసా..?
బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్ 10 వేల టికెట్లు, బాలీవుడ్ సింగర్ అనన్య బిర్లా 10 వేల టికెట్లు కొనుగోలు చేసి పేదలు, అనాథ పిల్లలకు ఉచితంగా సినిమా చూపించనున్నట్లు తెలిపారు. ఇక శ్రేయాస్ మీడియా అధినేత శ్రీనివాస్ మరో అడుగు ముందుకు వేసి ఖమ్మం జిల్లాలోని ప్రతి గ్రామంలో ఉండే రామాలయానికి 101 టికెట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. తాజాగా ఈ జాబితాలోకి టాలీవుడ్ హీరో మంచు మనోజ్ చేరారు. తెలుగు రాష్ట్రాల్లోని అనాథ శరణాలయాల్లోని 2500 మంది చిన్నారులకు సినిమాను ఉచితంగా చూపించేందుకు మనోజ్ దంపతులు ముందుకు వచ్చారు.
Jai Shri Ram 🙏🙏🙏#Adipurush ❤️🔥@BhumaMounika@Brihaspathitec @namastheworld#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh @TSeries @Retrophiles1 @UV_Creations @Offladipurush #Pramod #Vamsi @AAFilmsIndia @peoplemediafcy pic.twitter.com/WM1yolK0C2
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) June 12, 2023
2018 Movie : ఓటీటీకి వచ్చేసిన తరువాత కూడా చరిత్ర సృష్టించిన 2018.. మలయాళ ఇండస్ట్రీలోనే మొదటి..
‘ఎలాంటి హద్దులు లేకుండా ప్రతి ఒక్కరు వేడుకలా జరుపుకోవాల్సిన చిత్రం ఆదిపురుష్. ఇది మా జీవితంలో దొరికిన గొప్ప అవకాశం. రామాయణం గురించి తెలుసుకునేలా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అనాథ శరణాల్లో ఉంటున్న 2500 మంది చిన్నారులకు ఈ సినిమా చూపించాలని నిర్ణయించుకున్నాం. ఈ గొప్ప కార్యక్రమాన్ని కోసం బృహస్పతి టెక్, నమస్తే వరల్డ్ సంస్థలతో మేం చేతులు కలిపాం. జూన్ 16న ఆదిపురుష్ సినిమా విడుదల కానుంది. జై శ్రీరామ్ అన్ని చోట్లా ప్రతిధ్వనించాలి.’ అని మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.