MS Dhoni: హీరోలు తయారుకారు.. పుడతారు..! ధోనీపై ప్రశంసలతో సినీ నటి ఖుష్భూ ట్వీట్

సినీ నటి, బీజేపీ లీడర్ ఖుష్బు సుందర్ మహేందర్ సింగ్ ధోనిపై ప్రశంసలు కురిపించారు. హీరోలు తయారుకారు.. పుడతారు.. ధోని ఆ విషయాన్ని నిరూపించాడు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

MS Dhoni: భారత్ జట్టు మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ (chennai super king)  సారథి మహేందర్ సింగ్ ధోని (M.S. Dhoni) కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు, సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ధోనిని ఎంతో ఇష్టపడుతుంటారు. ధోని సైతం అప్పుడప్పుడు తన అభిమానుల ఇంటికి వెళ్తూ సర్ ఫ్రైజ్ చేస్తాడు. తాజాగా మిస్టర్ కూల్ కెప్టెన్ గా పేరుపొందిన మహేందర్ సింగ్ ధోనీ ప్రముఖ సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) అత్తగారిని ఇంటికెళ్లి కలిశాడు. ధోని రాకతో ఖుష్బూ ఫ్యామిలీ మెంబర్స్ ఆనందానికి అవదులు లేవు. సంతోషంతో ఖష్బు అత్తగారు (Khushbu mother-in-law)  ధోనిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ముద్దులతో ముంచెత్తారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఖుష్బు తన ట్విటర్ (Twitter) ఖతాలో షేర్ చేశారు.

MS Dhoni: నెక్ట్స్ మ్యాచ్‌లో ధోని డౌటే.. వచ్చే రెండుమూడు మ్యాచ్‌లకు విశ్రాంతి తప్పనిసరా?

ఖుష్బు సుందర్ అత్తమ్మకు ధోని అంటే ఎంతో అభిమానం. ఆమెకు 88 ఏళ్లు. ధోనీ క్రీజులో ఉన్నాడంటే ఆమె టీవీకి అతుక్కుపోతారు. అంతలా ధోనీని ఇష్టపడతారు. ప్రస్తుతం  ధోని ఐపీఎల్ 2023 సీఎస్కే జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇటీవల రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే జట్టు ఓడిపోయింది. ఈనెల 17న బెంగళూరు జట్టుతో ధోని సేన ఆడాల్సి ఉంది. మ్యాచ్ కు నాలుగు రోజుల సమయం ఉండటంతో ధోనీ రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఖుష్బు సుందర్ అత్తగారింటికి వెళ్లి ఆమెకు ధోని సర్ ఫ్రైజ్ ఇచ్చాడు. కొద్దిసేపు ఆమెతో, ఆమె కుటుంబ సభ్యులతో ధోని సరదాగా గడిపాడు.

MS Dhoni: ధోని ఆడింది 17 బంతులే.. జియో వ్యూస్ మాత్రం రెండున్నర కోట్లు

ఇందుకు సంబంధించిన ఫొటోలను ఖుష్బు తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ధోనిపై ప్రశంసల వర్షం కురిపించారు. హీరోలు తయారు కారు.. పుడతారు. ధోని ఆ విషయాన్ని ఇవాళ నిరూపించాడు. ధోని ప్రేమ, అతిథ్యానికి నాకు మాటలు రావడం లేదు. మా అత్తగారు ధోనిని ఎంతో ఆరాధిస్తుంటారు. నేరుగా ధోని వచ్చి మా అత్తగారిని కలవడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. ఆమె ఆయుష్సును, సంతోషాన్ని ధోని మరింత పెంచారు. ఇందుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ధోని, ఖుష్భు, ఆమె అత్తగారు దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు