టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన చేసింది. బాబర్ ఆజాం నేతృత్వంలోని పాక్ జట్టు అమెరికా, భారత్ చేతిలో ఓడి గ్రూప్ దశ నుంచే నిష్ర్కమించింది. దీంతో పాకిస్తాన్ జట్టు పై ఇంటా, బయటా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జట్టులో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పాక్ మాజీ ఆటగాళ్లు ఆదేశ క్రికెట్ బోర్డుకు సూచిస్తున్నారు. ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్కు చేరుకున్న బాబర్ బృందం లాహోర్లోని గడ్డాఫీ స్టేడియంలోని ప్రాక్టీస్ సెషన్స్లో పాల్గొంది.
బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ ఆ జట్టు పేలవ ప్రదర్శన చేస్తున్నట్లు మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్న క్రమంలో ఓ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఆ వీడియోలో పాకిస్తాన్ ఆటగాళ్లు క్యాచులను పట్టుకుంటున్నారు. పాక్ స్టార్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్తో పాక్ కొంత మంది పాక్ ఆటగాళ్లు మైదానంలో ఏర్పాటు చేసిన పరుపులపై క్యాచులు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ కాగా.. ఆ దేశ అభిమానులు దీనిపై మండిపడుతన్నారు.
Jasprit Bumrah : బుమ్రా భార్య పేరిట ఫేక్ అకౌంట్.. సంజనా గణేశన్ తీవ్ర ఆగ్రహం..
పరుపులపై క్యాచులు ప్రాక్టీస్ చేస్తుంటే ఇక ఎన్నకి ప్రపంచకప్లు గెలవలేమని ఓ నెటిజన్ అనగా.. ఇలాగైతే పాక్ మ్యాచులు గెలవడం కష్టం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఓ దిండు, దుప్పటి తెచ్చుకుని అక్కడే నిద్రపోండి అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు.
This is so ridiculous – cricket is the richest sport and these professionals are honing their craft on bed mattresses! I reckon the fields in the next series they play will be covered with these..
— Rajasthani Tau Ji (@Rajasthanii_Tau) July 3, 2024
They are making a joke out of themselves.
No wonder PCB is in a clown state.— Rahul 🇮🇳 🇦🇺 (@tweets_Sky33) July 3, 2024
They are making a joke out of themselves.
No wonder PCB is in a clown state.— Rahul 🇮🇳 🇦🇺 (@tweets_Sky33) July 3, 2024
Yar is Matress say behtar hai grass pey jump kar lain
— Faisal Syed (@FHASEEN) July 2, 2024