టీ20 ప్రపంచ కప్తో న్యూఢిల్లీ చేరుకున్న టీమిండియాకు ఘనస్వాగతం లభించిన విషయం తెలిసిందే. అనంతరం క్రికెటర్లు బస్సులో ఐటీసీ మౌర్య హోటల్కు వెళ్లారు. వారికి స్వాగతం పలికేందుకు హోటల్ సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక కేక్, త్రివర్ణ పతాక రంగులతో చేసిన డ్రింక్స్ ఆకర్షించాయి.
టీమిండియాకు స్వాగతం పలుకుతూ అక్కడ కొట్టిన ఢోలు విని కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ స్టెప్పులు వేశారు. అక్కడి డ్యాన్సర్లతో కలిసి వారిద్దరు చేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, 17 ఏళ్ల తర్వాత టీమిండియా మళ్లీ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న విషయం తెలిసిందే.
బార్బడోస్లో ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం కొన్ని రోజులు తుపాను వల్ల టీమిండియా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. తుపాను కాస్త తగ్గడంతో బీసీసీఐ భారత ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానం ఏర్పాట్లు చేసి వారిని ఇండియాకు తీసుకొచ్చింది. ఇవాళ సాయంత్రం భారత ఆటగాళ్లు ముంబైలో రోడ్ షోలో పాల్గొంటారు. ఇవాళ రాత్రి వాంఖడేలో టీమిండియాను బీసీసీఐ సన్మానిస్తుంది.
Suryakumar Yadav erupts in joy after landing in India. 😂❤️pic.twitter.com/onaJ0zrdFg
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2024
Captain Rohit Sharma dance after arriving in delhi.
Team India arrived in Delhi with the T20 World Cup 2024 trophy.#DelhiAirport#T20WorldCup #IndianCricketTeam #RohitSharma𓃵 @BCCI pic.twitter.com/DwRmIDqPIz
— Indrajeet chaubey (@indrajeet8080) July 4, 2024
Jubilation in the air 🥳
The #T20WorldCup Champions have arrived in New Delhi! 🛬
Presenting raw emotions of Captain @ImRo45 -led #TeamIndia‘s arrival filled with celebrations 👏👏 pic.twitter.com/EYrpJehjzj
— BCCI (@BCCI) July 4, 2024