Viral Video: అందరి ముందు డ్యాన్స్ చేసిన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్

అక్కడి డ్యాన్సర్లతో కలిసి వారిద్దరు చేసిన..

టీ20 ప్రపంచ కప్‌తో న్యూఢిల్లీ చేరుకున్న టీమిండియాకు ఘనస్వాగతం లభించిన విషయం తెలిసిందే. అనంతరం క్రికెటర్లు బస్సులో ఐటీసీ మౌర్య హోటల్‌కు వెళ్లారు. వారికి స్వాగతం పలికేందుకు హోటల్ సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక కేక్, త్రివర్ణ పతాక రంగులతో చేసిన డ్రింక్స్ ఆకర్షించాయి.

టీమిండియాకు స్వాగతం పలుకుతూ అక్కడ కొట్టిన ఢోలు విని కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ స్టెప్పులు వేశారు. అక్కడి డ్యాన్సర్లతో కలిసి వారిద్దరు చేసిన డ్యాన్స్ కు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా, 17 ఏళ్ల తర్వాత టీమిండియా మళ్లీ ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న విషయం తెలిసిందే.

బార్బడోస్‌లో ఫైనల్ మ్యాచ్ ముగిసిన అనంతరం కొన్ని రోజులు తుపాను వల్ల టీమిండియా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. తుపాను కాస్త తగ్గడంతో బీసీసీఐ భారత ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానం ఏర్పాట్లు చేసి వారిని ఇండియాకు తీసుకొచ్చింది. ఇవాళ సాయంత్రం భారత ఆటగాళ్లు ముంబైలో రోడ్ షోలో పాల్గొంటారు. ఇవాళ రాత్రి వాంఖడేలో టీమిండియాను బీసీసీఐ సన్మానిస్తుంది.

Also Read : మీ దుంప‌లు తెగ‌.. ఓ దుప్ప‌టి, దిండు కూడా తెచ్చుకోక‌పోయారా..? ప‌రుపుల‌పై పాక్ ఆటగాళ్ల క్యాచింగ్ ప్రాక్టీస్‌..

ట్రెండింగ్ వార్తలు