Purvanchal Expressway in UP : ఉత్తర్ప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవాన్ని ప్రధానమంత్రి మోదీ ఇవాళ వినూత్నంగా నిర్వహించనున్నారు. భారత వాయుసేనకు చెందిన సీ-130జే సూపర్ హెర్క్యులస్ విమానంలో ఈ రహదారిపై దిగి కార్యక్రమాన్ని చేపడతారు. ఈ సందర్భంగా నిర్వహించే వైమానిక విన్యాసాలకు, ల్యాండింగ్ కసరత్తుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇందులో భాగంగా ఏఎన్-32 విమానం, ఫైటర్ జెట్లు సుఖోయ్-30 ఎంకేఐ, మిరాజ్-2000లు ఆదివారం ఈ మార్గంపై ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ప్రధాన మంత్రిని తీసుకొచ్చే సీ-130జే కూడా సుల్తాన్పుర్ జిల్లాలో సిమెంటుతో వేసిన ఎయిర్ స్ట్రిప్లో దిగింది. 3వందల 40 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో కొన్ని సెక్షన్లను అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాలు దిగడానికి, టేకాఫ్ కావడానికి వీలుగా తీర్చిదిద్దారు.
MPTC, ZPTC Elections : ఏపీలో 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్
ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మోదీ సుల్తాన్పుర్ జిల్లాలోని కర్వాల్ ఖేరి వద్ద దిగుతారు. అనంతరం ఆయన ఓ బహిరంగ సభలో పాల్గొనడానికి వెళతారు. తిరిగొచ్చి.. మిరాజ్-2000, ఏఎన్-32 విమానాల ల్యాండింగ్ను వీక్షిస్తారు. ఏఎన్-32లో బలగాలు కూడా దిగుతాయి.
అనంతరం ఆకాశంలో వైమానిక విన్యాసాలు జరుగుతాయి. ఇందులో మూడు కిరణ్ మార్క్-2 విమానాలు, రెండు సుఖోయ్-30 ఎంకేఐ జెట్లు పాల్గొంటాయి. అత్యవసర సమయాల్లో యుద్ధవిమానాలు రహదారులపై దిగడం రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రారంభమైంది. తొలుత జర్మనీలో అలాంటి విన్యాసం జరిగింది.