Priya Prakash Varrier : ‘ఒరు ఆడార్ లవ్’ సినిమాలో కన్ను కొట్టే ఒక్క సీన్తో ప్రియా వారియర్ దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ఆ తర్వాత మలయాళం, తెలుగు సినిమాలలో వరుస ఛాన్సులు దక్కించుకుంటుంది. ఇప్పటికే తెలుగులో చెక్, ఇష్క్ సినిమాలతో మెప్పించిన ప్రియా వారియర్ మరిన్ని తెలుగు సినిమాలతో రాబోతుంది. తాజాగా తనకు ఓ హోటల్లో చేదు అనుభవం ఎదురైందని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తెలిపింది.
ఇటీవల ఓ షూటింగ్ కి ముంబై వెళ్లిన ప్రియా వారియర్ అక్కడ ఒక హోటల్ లో బస చేసింది. అయితే ఆ హోటల్ తో తనకు చేదు అనుభవం ఎదురైందని తన స్టోరీలో పోస్ట్ చేసింది. ”ఫెర్న్ గొరెగాన్ హోటల్లో నేను బస చేశాను. ఈ హోటల్ పాలసీ ఏంటంటే బయట ఫుడ్ను లోపలికి అస్సలు అనుమతించరు. ఎందుకంటే అతిథులు ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేస్తే వాళ్లకు ఎక్కువ డబ్బులు వస్తాయి. నాకు ఈ సంగతి తెలియదు. షూటింగ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఫుడ్ కొనుక్కుని హోటల్కు వచ్చాను. అయితే హోటల్ బుకింగ్, రిజిస్ట్రేషన్ ఇలాంటివన్నీ ప్రొడక్షన్ కంపెనీ వాళ్లే చేస్తారు. ఆర్టిస్టులకు సంబంధం ఉండదు కాబట్టి వాళ్లకి ఇష్టమొచ్చిన పాలసీలని ఫాలో అవుతున్నారు.
Ram Charan : రామ్ చరణ్, బాలయ్య బాబు గణతంత్ర వేడుకలు
నా ఫుడ్ ని అస్సలు లోపలికి పంపించలేదు. నేను ఎంతో మర్యాదగా వారిని వేడుకున్నా. ఈ ఒక్కసారికి వదిలేయండి. ఎందుకంటే డబ్బులు పెట్టి ఫుడ్ కొన్నాను, పైగా నాకు దాన్ని పారేయడం ఇష్టం లేదు అని. కానీ వాళ్లు వినలేదు. ఆ ఫుడ్ను బయటే వదిలేయాలంటూ పెద్ద సీన్ చేశారు. కనీసం నేను చెప్పేది కూడా వినిపించుకోలేదు. నాతో చాలా అమర్యాదగా ప్రవర్తించారు. దీంతో బయట చలిలో భోజనం చేయాల్సి వచ్చింది” అని పోస్ట్ చేసింది ప్రియా వారియర్.
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్
ఈ పోస్ట్ తో పాటు తను ఆ హోటల్ బయట కూర్చున్న వీడియోని కూడా పోస్ట్ చేసింది. ప్రియా వారియర్ పెట్టిన స్టోరీకి నెటిజన్లు చాలా మంది స్పందిస్తూ ప్రియకి సపోర్ట్ గా కామెంట్లు చేస్తున్నారు. అలాగే ఆ హోటల్ ని ట్రోల్ చేస్తున్నారు.