Prabhas : ప్రభాస్ లుక్స్ పై నటి కస్తూరి వైరల్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న రెబల్స్!

ఆదిపురుష్ సినిమాలోని ప్రభాస్ లుక్స్ పై సీనియర్ నటి కస్తూరి వైరల్ కామెంట్స్ చేసింది. రాముడు గుర్తుకు రావడం లేదు కర్ణుడు గుర్తుకు వస్తున్నాడు అంటూ..

Prabhas Adipurush : ప్రభాస్ రాముడిగా రామాయణం కథాంశంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ (Kriti Sanon) సీతగా, సైఫ్ అలీఖాన్ (Saif Alikhan) రావణాసురుడిగా కనిపించబోతున్నారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. హిందూ ఇతిహాసంలోని రాముడి కథతో వస్తున్న సినిమా కావడంతో ప్రశంసలు, విమర్శలు ఎదురు అవుతున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ నటి కస్తూరి (Kasturi) ప్రభాస్ పై వైరల్ కామెంట్స్ చేసింది.

Mahesh Babu : మహేష్ బాబు న్యూ లుక్స్.. రాజమౌళి సినిమా కోసమేనా..?

“ఏ ట్రెడిషన్ లో శ్రీరామలక్ష్మణులకు మీసాలు, గడ్డలు చూపించారు. ఎందుకు రామలక్ష్మణులను ఇలా చూపిస్తున్నారు. ప్రభాస్ సొంత ఇండస్ట్రీలో ఎంతో గొప్ప లెజెండ్స్ శ్రీరామ పాత్రలను చాలా చక్కగా చేశారు. కానీ ఇప్పుడు ప్రభాస్ ని చూస్తుంటే నాకు రాముడు గుర్తుకు రావడం లేదు కర్ణుడు గుర్తుకు వస్తున్నాడు” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ట్వీట్ పై ప్రభాస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. సకల శుగణాభిరాముడు కథని నేటి తరానికి తెలిపేలా ప్రభాస్ ప్రయత్నిస్తుంటే ప్రశంసించాల్సింది పోయి విమర్శిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Jabardasth Punch Prasad : పంచ్ ప్రసాద్‌కి జగన్ ప్రభుత్వం సాయం.. ఏపీ సీఎంవో ట్వీట్!

ఇది ఇలా ఉంటే.. ఈ శుగణాభిరాముడు కథని ప్రతి ఒక్కరు చూసేలా పలువురు సెలబ్రిటీస్ చర్యలు తీసుకుంటున్నారు. నార్త్ లోని పలు ప్రాంతాల్లోని పేద పిల్లలకు రాముడి కథని ఫ్రీగా చూపించేందుకు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) 10,000 టికెట్స్ ని కొనుగోలు చేశాడు. అలాగే కార్తికేయ 2 (Karthikeya 2) నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా.. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు, అనాధ శరణాలయాలకు, వృధాశ్రమాలకు 10 వేల టికెట్స్ ని ఫ్రీగా డొనేట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు