Madhya Pradesh : పసిగుడ్డును పొట్టన పెట్టుకున్న పిల్లి.. టెర్రస్‌పై నుంచి కిందకు పడేయడంతో చనిపోయిన చిన్నారి

కవలలు జన్మించడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. అంతలో ఓ అడవి పిల్లి వారిలో ఓ చిన్నారిని పొట్టన పెట్టుకుంది. పసిగుడ్డును నోట కరుచుకుని టెర్రస్‌పై నుంచి కిందకు పడేసింది.

Madhya Pradesh

Madhya Pradesh : ఆ ఇంటికి బోలెడు సంతోషాల్ని తెస్తూ ట్విన్స్ పుట్టారు. పాపకు అల్షిఫా, బాబుకి రిహాన్ అని పేర్లు పెట్టుకున్నారు. వారి సంతోషం 15 రోజులు కూడా నిలవలేదు. ఓ అడవి పిల్లి వారి ఆనందంపై నీళ్లు పోసింది.

Madhya Pradesh : మధ్యప్రదేశ్‌లో మరో షాకింగ్ ఘటన..దళితుడికి మలం పూసి…

మధ్యప్రదేశ్‌లోని బుడౌన్ జిల్లాలో విషాదం నెలకొంది. తల్లి ఒడిలో నిద్రిస్తున్న నవజాత శిశువుని ఎత్తుకెళ్లిన ఓ అడవి పిల్లి ఇంటి పై కప్పు నుంచి కిందకు పడేసింది. పసిగుడ్డు చనిపోవడంతో ఆ ఇల్లు శోక సంద్రంలో మునిగిపోయింది. గౌత్ర పట్టి భౌని గ్రామం ఉసావాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. హసన్, ఆస్మా దంపతులు 15 రోజుల క్రితం కవలలకి జన్మనిచ్చారు. వారికి రిహాన్, అల్షిఫా అని పేర్లు పెట్టుకున్నారు. ఎంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో పిల్లి తీరని శోకం నింపింది. అర్థరాత్రి  సమయంలో తలుపు శబ్దం అవడంతో నిద్ర లేచిన కుటుంబ సభ్యులు పిల్లి రిహాన్‌ని నోట కరుచుకుని వెళ్తుండగా చూసి పరుగులు తీశారు. పిల్లి ఆ పసిగుడ్డును టెర్రస్ నుంచి కిందకు పడేసి పారిపోయింది. దాంతో ఆ చిన్నారి చనిపోయాడు.

Vindhya Separate State Demand : మధ్యప్రదేశ్ లో మరోసారి వింధ్య ప్రత్యేక రాష్ట్ర డిమాండ్.. బీజేపీ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే తిరుగుబాటు
అడవి పిల్లి నవజాత శిశువును పై కప్పు నుంచి పడవేసినట్లు ఉసావాన్ పోలీస్ స్టేషన్ ఇన్ ఛార్జ్ రామేంద్ర సింగ్ చెప్పారు. అయితే ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు