Mumbai : ముంబయి నగరంలోని ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు మరణించారు. మహారాష్ట్రలోని ముంబయి పరిధిలోని గోరేగావ్లోని ఓ భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మరో 40 మంది తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో పలు ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా దగ్ధమయ్యాయి.
Also Read : Shikhar Dhawan : క్రికెటర్ శిఖర్ ధావన్ భార్య ఆయేషాకు 8 ఏళ్లలో ఎన్ని కోట్లరూపాయలు ఇచ్చారంటే…
అగ్నిమాపక సిబ్బంది భవనంలో మంటలను ఆర్పుతున్నారు. ఏడు అంతస్తుల భవనంలోని పార్కింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు అధికారులు చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు వెంటనే మంటలను ఆర్పే చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అనంతరం మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పార్కింగ్ ఏరియాలో పడి ఉన్న గుడ్డకు మంటలు అంటుకోవడంతో మంటలు ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | Maharashtra | Latest visuals from the G+5 building in Goregoan, Mumbai where a level 2 fire broke out.
As per Mumbai Police, the condition of six people rescued is critical. A total of 30 people have been rescued. https://t.co/G3Z0MihDc3 pic.twitter.com/Vn73WMFwFH
— ANI (@ANI) October 6, 2023