Murder in Beach: 19 ఏళ్ల యువతిని గోవా బీచ్‌కి తీసుకెళ్లి హత్య చేసిన యువకుడు

ప్రేమ సంబంధం కొనసాగించడానికి నిరాకరించిందంటూ ఓ 19 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన గోవాలో చోటుచేసుకుంది.

Murder in Beach: దేశంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. కోర్టులు కఠిన శిక్షలు విధిస్తున్నా కొందరిలో మార్పు రావడంలేదు. ప్రేమ సంబంధం కొనసాగించడానికి నిరాకరించిందంటూ ఓ 19 ఏళ్ల యువతిని ఆమె ప్రియుడు దారుణంగా హత్య చేసిన ఘటన గోవాలో చోటుచేసుకుంది. యువతిని బీచ్ కు తీసుకెళ్లిన యువకుడు ఆమెను కొట్టి చంపాడు. సౌత్ గోవా ఎస్పీ అభిషేక్ ధనియా తెలిపిన వివరాలు మేరకు..గోవాలోని న్యూ వడ్ఢేమ్ కు చెందిన దియా నాయక్(19) అనే యువతి..వాస్కోకి చెందిన కిషన్ కలంగుట్కర్ తో కొంత కాలంగా పరిచయం ఉంది. ఈక్రమంలో ఇద్దరి మధ్య కొంత బంధం ఏర్పడింది. అయితే అనుకోని కారణాల వలన తమ బంధాన్ని ఇకపై కొనసాగించలేనని దియా నాయక్, కిషన్ తో చెప్పింది. అనంతరం కొన్ని రోజుల పాటు అంతా బాగానే ఉందనుకున్న క్రమంలో..కిషన్ తనను ప్రేమించాలంటూ దియా వెంట పడ్డాడు. యువతి ఎంతకూ ఒప్పుకోక పోవడంతో..ఆమె పై పగ పెంచుకున్నాడు.

Other Stories:Navjot Sidhu: సంవత్సరం జైలు శిక్ష విధించిన సుప్రీం, స్వతహాగా లొంగిపోయిన సిద్ధూ

ఈక్రమంలో మాట్లాడాలి రమ్మంటు మే 18న దియాను స్థానిక డాండో బీచ్ కి తీసుకెళ్లిన కిషన్..యువతిని తీవ్రంగా కొట్టి చంపాడు. అనంతరం బీచ్ వద్ద చెట్ల పొదల్లో యువతి మృతదేహాన్ని దాచిపెట్టాడు కిషన్. కాగా తమ కూతురు కనిపించడం లేదంటూ దియా తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా..గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లి ఇచ్చిన వివరాలు మేరకు కిషన్ కలంగుట్కర్ పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు..శుక్రవారం అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా..తానే హత్య చేసినట్లు యువకుడు ఒప్పుకున్నాడు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వాస్కో పోలీసులు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు