Udyan Express : ముంబయి-బెంగళూరు ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

ముంబయి-బెంగళూరు ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న (కెఎస్‌ఆర్‌) రైల్వే స్టేషన్‌లో ఉద్యాన ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి వచ్చాయి....

Udyan Express Fire breaks out

Udyan Express : ముంబయి-బెంగళూరు ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్‌లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న (కెఎస్‌ఆర్‌) రైల్వే స్టేషన్‌లో ఉద్యాన ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి వచ్చాయి. (Fire breaks out in Mumbai-Bengaluru Udyan Express) ముంబయి-బెంగళూరు ఉద్యాన్ ఎక్స్‌ప్రెస్ గమ్యస్థానానికి చేరుకున్న రెండు గంటల తర్వాత మంటలు చెలరేగాయని రైల్వే అధికారులు తెలిపారు.

Amarnath Yatra : లోయలో పడి అమరనాథ్ యాత్రికుడి మృతి

శనివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో రెండు కోచ్‌ల నుంచి పొగలు రావడంతో మంటలు చెలరేగాయి. బెంగళూరు స్టేషన్‌లో అగ్నిమాపకశాఖ అధికారులు మంటలను ఆర్పుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరికీ గాయాలు కాలేదు. ప్రయాణికులు రైలు దిగిన రెండు గంటల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.

Mumbai Model : 50 మంది పురుషులపై కిలాడీ ముంబయి మోడల్ వలపు వల

ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు చెప్పారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు చెప్పారు. ఇటీవల తరచూ జరుగుతున్న రైలు ప్రమాదాలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు