Udyan Express : ముంబయి-బెంగళూరు ఉద్యాన్ ఎక్స్ప్రెస్లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. బెంగళూరులోని క్రాంతివీర సంగొల్లి రాయన్న (కెఎస్ఆర్) రైల్వే స్టేషన్లో ఉద్యాన ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగడంతో అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి వచ్చాయి. (Fire breaks out in Mumbai-Bengaluru Udyan Express) ముంబయి-బెంగళూరు ఉద్యాన్ ఎక్స్ప్రెస్ గమ్యస్థానానికి చేరుకున్న రెండు గంటల తర్వాత మంటలు చెలరేగాయని రైల్వే అధికారులు తెలిపారు.
Amarnath Yatra : లోయలో పడి అమరనాథ్ యాత్రికుడి మృతి
శనివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో రెండు కోచ్ల నుంచి పొగలు రావడంతో మంటలు చెలరేగాయి. బెంగళూరు స్టేషన్లో అగ్నిమాపకశాఖ అధికారులు మంటలను ఆర్పుతున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు ఎవరికీ గాయాలు కాలేదు. ప్రయాణికులు రైలు దిగిన రెండు గంటల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది.
Mumbai Model : 50 మంది పురుషులపై కిలాడీ ముంబయి మోడల్ వలపు వల
ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు చెప్పారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదని సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు చెప్పారు. ఇటీవల తరచూ జరుగుతున్న రైలు ప్రమాదాలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.