Rich People: కొవిడ్ తర్వాత దేశంలో భారీగా పెరిగిన ధనవంతులు.. కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్నవారి సంఖ్య తెలిస్తే షాకవుతారు

గత మూడేళ్లలో కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య 51 శాతానికి పైగా పెరగడం గమనార్హం. వాస్తవానికి లాక్ డౌన్ విధించిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 81,653కి తగ్గింది

India: ఇటీవలి సంవత్సరాలలో దేశంలో ధనవంతుల సంఖ్య వేగంగా పెరిగింది. ఆదాయపు పన్ను డేటా ఈ విషయాన్ని ధృవీకరించింది. ఆదాయపు పన్ను డేటా ప్రకారం.. గత మూడేళ్లలో కొత్త మిలియనీర్ల సంఖ్య 50 శాతానికి పైగా పెరిగింది. సీబీడీటీ డేటా ప్రకారం.. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఒక కోటి రూపాయల కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 3 సంవత్సరాలలో అటువంటి కొత్త కోటీశ్వరుల పన్ను చెల్లింపుదారులు దేశ వ్యాప్తంగా 57,591 మంది పెరిగారు.

BJP Leaders on Rahul Gandhi: లధాఖ్‭లో రాహుల్ గాంధీ బైక్ రైడింగ్ చేస్తే బీజేపీ నేతలకు ఎందుకు అంత ఆనందం?

కోవిడ్‌కు ముందు 2019-20 ఆర్థిక సంవత్సరంలో అటువంటి పన్ను చెల్లింపుదారుల సంఖ్య 1,11,939 ఉండగా, తాజాగా వారి సంఖ్య (2022-23) 1,69,890కి పెరిగింది. మూడేళ్లలో ఇది 51 శాతం పెరుగుదల. కాగా, 2016-17లో వీరి సంఖ్య 68,263 మాత్రమే ఉండేది. గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి ప్రభావం చాలా కాలంగా కొనసాగుతున్న సమయంలో ఈ గణాంకాలు పెరిగాయి. అంటువ్యాధి కారణంగా, దేశం నెలల తరబడి లాక్ డౌన్ లో బంధీ అయింది. వాస్తవానికి దీని కారణంగా లక్షలాది కర్మాగారాల్లో పనులు ఆగిపోయాయి. ప్రజలు పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయారు.

CVC Annual Report: దేశంలో అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వ శాఖ ఏదో తెలుసా?

అయినప్పటికీ గత మూడేళ్లలో కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య 51 శాతానికి పైగా పెరగడం గమనార్హం. వాస్తవానికి లాక్ డౌన్ విధించిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 81,653కి తగ్గింది. మిలియనీర్ పన్ను చెల్లింపుదారుల సంఖ్య ఈ పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా ఆదాయం, పన్నులకు సంబంధించిన డేటా సేకరణ ప్రక్రియ పారదర్శకంగా, ప్రభావవంతంగా మారిందని పన్ను నిపుణులు అంటున్నారు. ఇవే కాకుండా స్టాక్ మార్కెట్ ర్యాలీ, స్టార్టప్ కంపెనీల ఆవిర్భావం, అధిక జీతభత్యాల ఉద్యోగాల్లో బూమ్, మూన్‌లైట్ వంటి అంశాలు కూడా కోటీశ్వరుల పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచాయట.

Madhya Pradesh Elections: ఎన్నికల వేళ హామీల వర్షం.. కేజ్రీవాల్ ఏమేం ప్రకటించారో తెలుసా?

ఈ ఏడాది ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలుకు గడువు ముగిసింది. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి గడువు 31 జూలై 2023 వరకు కొనసాగించారు. అయితే ఆ తర్వాత కూడా పన్ను చెల్లింపుదారులు రూ.1000 జరిమానా చెల్లించి రిటర్న్‌లు దాఖలు చేస్తున్నారు. ఈ ఏడాది ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసిన వారి సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. గడువు తేదీ వరకు 6.75 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేశారు. ఇది గత ఏడాదితో పోలిస్తే కోటి కంటే ఎక్కువ.

ట్రెండింగ్ వార్తలు