India vs Pakistan T20 Match: పాక్‌పై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ తరువాత రాహుల్ ద్రవిడ్ రియాక్షన్ చూశారా.. వీడియో వైరల్

టీ మిండియా వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో చివరికి టీమిండియా విజయాన్ని దక్కించుకుంది. అప్పటి వరకు టెన్షన్ టెన్షన్ గా మ్యాచ్ చూసిన టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, జట్టు సభ్యులు విజయం అనంతరం కేరింతలు కొడుతూ సంబురాలు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

India vs Pakistan T20 Match: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ స్టేడియం వేదికగా ఆదివారం భారత్ -పాకిస్థాన్ మధ్య ఉత్కంఠపోరు సాగింది. నువ్వానేనా అన్నట్లు ఇరుజట్లు చివరి వరకు పోరాటం సాగించాయి. చివరికి కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించడంతో భారత్ జట్టు విజయం సాధించింది. అయితే, చివరి బాల్ వరకు తీవ్ర ఉత్కంఠ భరితంగా, నాటకీయంగా జరిగిన మ్యాచ్‌ను ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఊపిరిబిగబట్టుకొని చూడాల్సి వచ్చింది.

T20 World Cup IndVsPak : వాటే మ్యాచ్.. ఉత్కంఠపోరులో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. విరాట్ కోహ్లి విశ్వరూపం

టీమిండియా విజయం తరువాత జట్టు సభ్యుల సంబరాలు అంబరాన్నంటాయి. చివరి ఓవర్లో ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడింది. మ్యాచ్ చూసేవారికి క్షణక్షణం టెన్షన్ పెట్టింది. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉంది. దినేష్ కార్తీక్ క్రీజ్‌లో ఉన్నాడు. పాక్ బౌలర్ మహ్మద్ నవాజ్ వేసిన బంతికి కార్తీక్ అవుట్ అయ్యాడు. క్రిజ్‌లోకి అశ్విన్ వచ్చాడు. మరోవైపు కోహ్లీ ఉన్నారు. ఒక్క బాల్‌కు రెండు పరుగులు చేయాలి. అశ్విన్ ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ వైడ్ కావటంతో భారత్ జట్టు అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. మ్యాచ్ డ్రా అయింది. ఒక్క బాల్ కు ఒక్క పరుగు తీయాలి.. చివరి బంతికి అశ్విన్ ఫోర్ కొట్టడంతో భారత్ జట్టు అద్బుత విజయాన్ని దక్కించుకుంది.

అప్పటివరకు టెన్షన్ లో ఉన్న భారత్ జట్టు సభ్యులు విజయంతో కేకలు, అరుపులతో సందడి చేశాడు. టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆనందం అంతాఇంతాకాదు. జట్టు సభ్యులతో కరచాలనం చేస్తూ రాహుల్ ద్రవిడ్ ఎగిరి గంతేశాడు. జట్టులోని పలువురు సభ్యులను ఆలింగనం చేసుకొని తన సంతోషాన్ని తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.

ట్రెండింగ్ వార్తలు