India vs Pakistan T20 Match: ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ స్టేడియం వేదికగా ఆదివారం భారత్ -పాకిస్థాన్ మధ్య ఉత్కంఠపోరు సాగింది. నువ్వానేనా అన్నట్లు ఇరుజట్లు చివరి వరకు పోరాటం సాగించాయి. చివరికి కోహ్లీ విశ్వరూపం ప్రదర్శించడంతో భారత్ జట్టు విజయం సాధించింది. అయితే, చివరి బాల్ వరకు తీవ్ర ఉత్కంఠ భరితంగా, నాటకీయంగా జరిగిన మ్యాచ్ను ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఊపిరిబిగబట్టుకొని చూడాల్సి వచ్చింది.
టీమిండియా విజయం తరువాత జట్టు సభ్యుల సంబరాలు అంబరాన్నంటాయి. చివరి ఓవర్లో ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడింది. మ్యాచ్ చూసేవారికి క్షణక్షణం టెన్షన్ పెట్టింది. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉంది. దినేష్ కార్తీక్ క్రీజ్లో ఉన్నాడు. పాక్ బౌలర్ మహ్మద్ నవాజ్ వేసిన బంతికి కార్తీక్ అవుట్ అయ్యాడు. క్రిజ్లోకి అశ్విన్ వచ్చాడు. మరోవైపు కోహ్లీ ఉన్నారు. ఒక్క బాల్కు రెండు పరుగులు చేయాలి. అశ్విన్ ఎదుర్కొన్న ఫస్ట్ బాల్ వైడ్ కావటంతో భారత్ జట్టు అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. మ్యాచ్ డ్రా అయింది. ఒక్క బాల్ కు ఒక్క పరుగు తీయాలి.. చివరి బంతికి అశ్విన్ ఫోర్ కొట్టడంతో భారత్ జట్టు అద్బుత విజయాన్ని దక్కించుకుంది.
A packed MCG chanting for Virat Kohli ?
Raw vision: Behind the scenes of India’s sensational win ?
Goosebumps. #T20WorldCup | #INDvPAK pic.twitter.com/MNjmOLKO7r
— ICC (@ICC) October 23, 2022
అప్పటివరకు టెన్షన్ లో ఉన్న భారత్ జట్టు సభ్యులు విజయంతో కేకలు, అరుపులతో సందడి చేశాడు. టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆనందం అంతాఇంతాకాదు. జట్టు సభ్యులతో కరచాలనం చేస్తూ రాహుల్ ద్రవిడ్ ఎగిరి గంతేశాడు. జట్టులోని పలువురు సభ్యులను ఆలింగనం చేసుకొని తన సంతోషాన్ని తెలిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.