Pawan Kalyan (Photo : Google)
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కోపం వచ్చింది. టికెట్లు ఆశిస్తున్న ఆశావహులపై ఆయన సీరియస్ అయ్యారు. అసలేం జరిగింది అంటే.. కొంతమంది ప్రముఖులు జనసేనకు విరాళం ఇస్తున్నామని చెప్పి చెక్కులు ఇచ్చారు. ఆ తర్వాత వారు తమ మనసులో మాటను బయటపెట్టారు. చెక్కులు ఇచ్చిన తర్వాత పలానా సీటు కావాలని డిమాండ్ చేశారు. దీంతో జనసేనాని పవన్ కల్యాణ్ కు కోపం వచ్చింది.
నేను అడక్కపోయినా జనసేనకు విరాళం పేరుతో చెక్కులు ఇచ్చి, ఇప్పుడు సీట్లు అడగటం ఏంటని.. ఆశావహులపై సీరియస్ అయ్యారు పవన్ కల్యాన్. అసెంబ్లీ, లోక్ సభ సీట్లు అడిగిన వారి చెక్లు వెనక్కి పంపాలని తన పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు పవన్ కల్యాణ్. పవన్ ఆదేశాలతో 7 చెక్కులను వెనక్కిపంపేశారు జనసేన నాయకులు. పార్టీకి విరాళం పేరుతో వారు ఇచ్చిన డబ్బుల చెక్ ను తిరిగి వారికే పంపేశారు. ఊహించని ఈ పరిణామంతో ఆశావహులు కంగుతిన్నారు. పవన్ నిర్ణయం వారిని షాక్ గురి చేసింది. తాము ఒకటి తలస్తే మరొకటి జరిగిందని వాపోయారు.
Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీ? పొత్తుతో కలిగే లాభాలు ఏంటి, ఎదురయ్యే సవాళ్లు ఏంటి..
మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో కొందరు ప్రముఖులు జనసేన టికెట్ ఆశిస్తున్నారు. జనసేన తరపున అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. జనసేన నుంచి అసెంబ్లీ, లోక్ సభ టికెట్లు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో వారు నేరుగా టికెట్ అడక్కుండా.. ముందుగా పార్టీకి విరాళం ఇచ్చినట్లుగా చెక్కులు ఇస్తున్నారు. ఆ తర్వాత పలానా టికెట్ కావాలని పవన్ కల్యాణ్ ముందు ప్రపోజల్ పెడుతున్నారు. వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఇది వర్కవుట్ కాలేదు. విరాళం రూపంలో చెక్ లు ఇచ్చి టికెట్లు ఆశిస్తున్న వ్యక్తులపై పవన్ సీరియస్ అయ్యారు. వెంటనే వారి చెక్కులు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో టీడీపీ-జనసేన పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో టికెట్ల కోసం గట్టి పోటీ ఉంది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు చేస్తున్నారు. జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అభ్యర్థులు ఎవరు? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read : టీడీపీ-జనసేన ఎంపీ అభ్యర్థులు వీళ్లే?