సంగీత దర్శకుడు దివంగత చక్రి కుటుంబానికి అనూహ్యా రెడ్డి ఆర్థిక సాయమందించారు..
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వివిధ వర్గాలకు చెందిన పేదలను ఆదుకునేందుకు సామాజిక బాధ్యతగా ‘కోవిద సహృదయ ఫౌండేషన్’ అరుదైన సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఆ సంస్థ వ్యవస్థాపకురాలు, సినీ కాస్ట్యూమ్ డిజైనర్, నిర్మాత, డాక్టర్ అనూహ్యా రెడ్డి గారి ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నిత్యావసర వస్తువులతో పాటు పండ్లు, కోడిగుడ్లు, ప్యాకేజ్డ్ ఆహారాన్ని పేదలకు అందజేస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు కూడా పంపిణీ చేస్తున్నారు.
తాజాగా దివంగత సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ నారాయణ, వారి తల్లి మణికొండలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలియడంతో వారికి రెండు నెలలకు సరి పడా మందులు, నిత్యావసర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా అనుహ్యా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సాయం అందించినందుకు చాలా సంతోషంగా ఉందని మహిత్ అన్నారు. కానీ తనకు ఒక పని ఇప్పించాలని కోరారు. దీంతో నేను కరోనాపై ఓ ట్యూన్ చేయాలని మహిత్ను కోరాను. మహిత్ది చాలా మంచి మనసు’’ అని తెలిపారు.
మహిత్ మాట్లాడుతూ.. అనూహ్యా గారి మంచి హృదయానికి నా కృతజ్ఞతలు.. అడగ్గానే సాయమందించి తన పెద్ద మనసు చాటుకున్నారు. లాక్డౌన్ కారణంగా వర్క్స్ లేక ఇబ్బంది పడుతున్నాం. మా పనిని చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే మూడు, నాలుగు సినిమాలు చేశాను. బిజీగా పనులు చేస్తూ పదిమందికి సాయపడే స్థాయిలో ఉండాలనుకుంటున్నాను. ఓ సోదరిగా అనుహ్యా రెడ్డి ఇచ్చిన భరోసా నా హృదయాన్ని కదిలించింది’ అని తెలిపారు. అలాగే కృష్ణానగర్, మూసాపేట్ ప్రాంతాల్లోని 150 మంది ట్రాన్స్ జెండర్లకు అవసరమైన నిత్యావసర వస్తువులతో పాటు, ఆర్థిక సాయం కూడా అందించి తన మంచి మనసు చాటుకున్నారు డాక్టర్ అనూహ్యా రెడ్డి. తను చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి పలువురు ఆమెకు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నారు.
Provided Medicines, Vegetables and Fruits to famous music directors brother. #COVIDー19 #girlslockeroom #மே7அழிவின்ஆரம்பம் #BhulaDunga #JEEMains #tuesdayvibes #lockdown #Corona #PulitzerPrize #HandHygiene #Ramadan #webinar #COVID pic.twitter.com/pgGfYKAhN0
— Dr Anuhya Reddy (@DrAnuhyaReddy) May 5, 2020
Also Read | బిచ్చగాడు హీరో మంచి మనసు.. తన శాలరీలో 25 శాతం తగ్గింపు ప్రకటించాడు..