తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 206 కరోనా కేసులు

  • Publish Date - June 6, 2020 / 06:15 PM IST

తెలంగాణలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్క రోజే 206 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రధానంగా జీహెచ్ ఎంసీ పరిధిలోనే 152 మందికి కరోనా వైరస్ సోకింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3, 946 కు చేరింది. ఇవాళ 10 మంది మృతి చెందారు. దీంతో కరోనా మృతుల సంఖ్య 123 కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1663 గా నమోదు అయింది. 

నాలుగు నెలల్లో మార్చి 2న తెలంగాణలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినప్పటి నుంచి ఇప్పవరకు అత్యధికంగా, రికార్డు స్థాయిలో 206 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కసారిగా 152 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో కొంత ఆందోళన వాతావరణం నెలకొంది. 

రోజురోజుకు కరోనా కేసులు పెరుగున్న తరుణంలో లాక్ డౌన్ సడలింపులు ఒకవైపు, కేసులు ఒకవైపు..కరోనా మహమ్మారి అందరినీ పాజిటివ్ కేసుల్లోకి నెట్టేస్తోంది. మృతుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇవాళ ఒక్కరోజే పది మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. 

ట్రెండింగ్ వార్తలు