Coal Mine Fire Accident : కజకిస్తాన్ లోని కోస్తెంకో బొగ్గు గనిలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 32మంది చనిపోయారు. మరో 14మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మిథేన్ గ్యాస్ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో 252 మంది పని చేస్తున్నారు. ఈ ఘటనపై దేశ అధ్యక్షుడు జోమార్ట్ స్పందించారు. ఈ ఘటన విషాదకరం అని ప్రకటించారు.
Also Read : పిల్లలు కలగడం లేదని డాక్టర్ వద్దకు వెళ్లిన మహిళ.. 34 ఏళ్లకు బయట పడిన మోసం
గతంలోనూ ఈ బొగ్గు గనిలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఆగస్టులో ఇదే బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. నవంబర్ 2022లో మరో సైట్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఘటనలో 5మంది చనిపోయారు.