Somu Veerraju : కడప ఎయిర్ పోర్టుపై తాను చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అన్నారు. కడప ప్రజలకు, హత్యా రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదన్నారాయన. వివేకానంద రెడ్డి హత్యను మాత్రమే తాను ప్రస్తావించాను అని వివరణ ఇచ్చారు.
Alien Planets: “5,000 గ్రహాల్లో ఏలియన్స్”?.. అమెరికా అంతరిక్ష పరిశోధకుల వింత వాదన
రాయలసీమ జిల్లాల్లో ఎయిర్పోర్టులకు సంబంధించి సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కడప జిల్లాను ఉద్దేశించి మాట్లాడిన సోము వీర్రాజు.. ప్రాణాలు తీసేసే వారి జిల్లాలో కూడా ఎయిర్పోర్టులా అంటూ విశాఖలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. రాయలసీమ జిల్లాలకు చెందిన నేతలు సోమువీర్రాజు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. ఆయనపై మండిపడ్డారు. వివాదం ముదురుతుండటంతో సోము
వీర్రాజు వివరణ ఇచ్చారు. వివేకా హత్యను దృష్టిలో ఉంచుకునే తాను అలా మాట్లాడానని వివరణ ఇచ్చారు. కడప ప్రజలకు, హత్యా రాజకీయాలకు ఏ విధమైన సంబంధం లేదని స్పష్టం చేశారు.
సోము వీర్రాజు వ్యాఖ్యలపై చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కడప జిల్లా ప్రజల మనోభావాలు కించ పరిచేలా సోము వీర్రాజు మాట్లాడటం దారుణమన్నారు. కడప ప్రజలు హత్యలు చేసే వాళ్లని అనడం సరికాదని, అందుకు సోము వీర్రాజు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
సోము వీర్రాజువి వ్యక్తిగత వ్యాఖ్యలా? పార్టీ స్టాండా? చెప్పాలని నిలదీశారు శ్రీకాంత్ రెడ్డి.
Type-2 Diabetes: డిన్నర్ లేటవుతుందా.. షుగర్ పెరుగుతుందన్నమాటే..
‘గతంలో చంద్రబాబు కూడా ఇలానే కడప గుండాలు, రౌడీలు అని మాట్లాడారు. ఇలా మాట్లాడే వాళ్లకు సిగ్గుండాలి. రాయలసీమ సంస్కృతి తెలియకపోతే చరిత్ర చదవాలి’ అని సూచించారు. సినిమాల్లో లాభాల కోసం, ఫ్యాక్షన్ చూపించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పోలీస్ రికార్డుల్లో చూస్తే క్రైమ్ ఎక్కడుందో తెలుస్తుందన్నారు. అసలు కడప ప్రజలు అందర్నీ గౌరవించే వ్యక్తులని, తమ కడుపు కాలినా ఎదుటి వారి కడుపు నింపే తత్వం కడప వాళ్లదని చెప్పారు శ్రీకాంత్ రెడ్డి.