Komatireddy Raj Gopal Reddy : జాక్ పాట్ కొట్టిన కోమటిరెడ్డి.. ఎట్టకేలకు కీలక పదవి

Komatireddy Raj Gopal Reddy : పార్టీలో తనకు సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదని రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Komatireddy Raj Gopal Reddy (Photo : Google)

Komatireddy Raj Gopal Reddy – BJP : తెలంగాణ బీజేపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర అధ్యక్షుడినే మార్చేసింది. ఈటల రాజేందర్ కీలక పదవి ఇచ్చింది. పార్టీలో తనకు సరైన గుర్తింపు లేదని అసంతృప్తిగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా పోస్టు ఇచ్చింది.

Also Read..Dharmapuri Constituency: ధర్మపురిలో వివేక్ పోటీ చేస్తే ట్రయాంగిల్ ఫైట్.. హీటెక్కుతోన్న ధర్మపురి రాజకీయం

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జాక్ పాట్ కొట్టారు. బీజేపీ హైకమాండ్ ఆయనకు పదవి ఇచ్చింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. పార్టీలో తనకు సరైన గౌరవం ఇవ్వడం లేదని రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల అమిత్ షా ను కలసిన సందర్భంలో ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు రాజగోపాల్ రెడ్డి.

Also Read..Kishan Reddy: అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగాలేని కిషన్ రెడ్డి? కేబినెట్ సమావేశానికి గైర్హాజరు అందుకేనా?

నిన్న ఈటల రాజేందర్ కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, కిషన్ రెడ్డికి బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి ప్రకటించిన సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. పొంగులేటిని కలిశాడు అంటూ వార్తలొచ్చాయి. ఈ క్రమంలో అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డికి కార్యవర్గ సభ్యుడిగా ప్రకటిస్తూ బుజ్జగించే యత్నం చేసింది బీజేపీ అధిష్టానం. నేడు రాజగోపాల్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ప్రకటించారు జేపీ నడ్డా.

ట్రెండింగ్ వార్తలు