3 Idiots Sequel : త్రీ ఇడియట్స్‌‌కు సీక్వెల్? హింట్ ఇచ్చిన బాలీవుడ్ నటుడు.. అమీర్ ఖాన్ యాక్ట్ చేస్తాడా?

త్రీ ఇడియట్స్ సినిమాకి చాలా మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందని సమాచారం. త్రీ ఇడియట్స్ సినిమాలో నటించిన శర్మన్ జోషి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా సీక్వెల్ పై మాట్లాడాడు.

bollywood 3 Idiots movie Sequel hint by sharman joshi

3 Idiots Sequel :  బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో అమీర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి కలిసి నటించిన సినిమా త్రీ ఇడియట్స్. 2009లో రిలీజయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఎడ్యుకేషన్ సిస్టం, ఇండియన్ పేరెంట్స్, స్టూడెంట్స్ గురించి చెప్తూ కామెడీ, ఎమోషనల్ గా తెరకెక్కించిన సినిమా త్రీ ఇడియట్స్. ఆ తరువాత ఈ సినిమాని తమిళ్ లో కూడా రీమేక్ చేశారు.

త్రీ ఇడియట్స్ సినిమాకి చాలా మంది అభిమానులు ఉన్నారు. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందని సమాచారం. త్రీ ఇడియట్స్ సినిమాలో నటించిన శర్మన్ జోషి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా సీక్వెల్ పై మాట్లాడాడు.

శర్మన్ జోషి మాట్లాడుతూ.. త్రీ ఇడియట్స్ సినిమా వస్తే మరింత విజయం సాధిస్తుంది. రాజ్ కుమార్ హిరానీ గారు కూడా దానికి సీక్వెల్ తీద్దామని ఆలోచనలోనే ఉన్నారు. ఈ సినిమా సీక్వెల్ కోసం చాలా మంది అడిగారు, వాళ్ళని నిరాశపరచడం ఆయనకు ఇష్టం లేదు. త్రీ ఇడియట్స్ సీక్వెల్ కు సంబంధించిన కొన్ని ఆలోచనలు నాతో పంచుకున్నారు డైరెక్టర్. త్వరలోనే ఈ సీక్వెల్ ఉంటుందని భావిస్తున్నాను అని తెలిపాడు. దీంతో ఈ సినిమా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Prasad Imax : ప్రేక్షకుడిపై ప్రభాస్ అభిమానుల దాడి.. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రసాద్ ఐమాక్స్..

అయితే త్రీ ఇడియట్స్ సీక్వెల్ ని మళ్ళీ అమీర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషిలతోనే తీస్తారా లేక కొత్తవాళ్లతో తీస్తారా అనేది చూడాలి. అమీర్ ఖాన్ ఇప్పట్లో సినిమాలు చేయను అని ఇటీవల ప్రకటించాడు. ఇక రాజ్ కుమార్ హిరానీ ప్రస్తుతం షారుఖ్ ఖాన్ తో డుంకి సినిమా చేస్తున్నాడు. ఇది అయ్యాక త్రీ ఇడియట్స్ మొదలుపెడతారేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు