కేరళకు మళ్లీ భారీ వర్షం ముప్పు.. ఆ 8 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఇప్పటికే వయనాడ్ లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
- Naveen
- Published On : July 30, 2024 / 09:44 PM IST
Kerala Rains : కేరళకు మరోసారి భారీ ముప్పు పొంచి ఉంది. వయనాడ్ లో మళ్లీ వర్షం దంచికొడుతోంది. భారీ వానతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటికే వయనాడ్ లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. చనిపోయిన వారి సంఖ్య 107కి చేరింది. ఇప్పుడు మళ్లీ వాన పడుతుండటంతో 8 జిల్లాలకు వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. వయనాడ్, కోజికోడ్, మలల్లా, పాలక్కాడ్, ఇడెక్కి జిల్లాలతో పాటు మరికొన్నింటికి రెడ్ అలర్ట్ ఇచ్చారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read : వయనాడ్లో మాటలకందని మహా విషాదం.. ఎటు చూసినా విధ్వంసం జాడలు.. భీతావాహ దృశ్యాలు
