Mahabubnagar District Hospital : తెలంగాణలో కరోనా విభృంభిస్తోంది. రాష్ట్రంలో భారీగా కేసులు పెరుగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా కలకలం రేపింది. 32 మంది ఆస్పత్రి సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరోవైపు తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ రావు కూడా కరోనా బారిన పడ్డారు. కోవిడ్ పరీక్షలు చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప కోవిడ్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరుతున్నట్లు వెల్లడించారు.
స్వల్ప కోవిడ్ లక్షణాలు కనపడి, పరీక్ష ద్వారా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ మరియు తగిన చికిత్స కోసం తాను ఆసుపత్రిలో చేరుతున్నాట్లు పేర్కొన్నారు. ఏ విధమైన ఆందోళనలు, అపోహలు వద్దనీ, త్వరలో పూర్తి స్వస్థతతో మీ ముందుకు వస్తానని తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. అందరినీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండమని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
Tirumala : శ్రీవారిని దర్శించుకుంటున్న వెనుకబడిన ప్రాంతాల భక్తులు.. రోజుకు వెయ్యి మంది
హైదరాబాద్ బీఆర్ఎకే భవన్లో ఐఏఎస్ అధికారులతో పాటు ఉద్యోగులకు వైరస్ సోకింది. సాధారణ పరిపాలన శాఖ, విద్యాశాఖల్లో 15 మందికి కోవిడ్తో బాధపడుతున్నారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్తో పాటు మరో ఐఏఎస్ అధికారి హోం ఐసోలేషన్లో ఉన్నారు. విద్యాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాకు పాజిటివ్ నిర్ధారణ అయింది.
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సీసీఎస్, సైబర్ క్రైమ్ విభాగాల్లో పనిచేస్తున్న 20మంది కోవిడ్ బారిన పడ్డారు. ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవల సైబర్ క్రైమ్ టీమ్ రాజస్తాన్ వెళ్లి వచ్చింది. వారిలో ఎస్ఐకి పాజిటివ్ నిర్ధారణ అయింది. అతని ద్వారా మిగిలిన వారికి కరోనా సోకింది.
G Srinivasa Rao : తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుకి కరోనా పాజిటివ్
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీసు స్టేషన్లో కూడా 20మంది పోలీసులు కోవిడ్ బారినపడ్డారు. బాధితులంతా హోం ఐసోలేషన్లో ఉంటున్నారు. పోలీసు స్టేషన్లోకి ఎవరినీ అనుమతించడంలేదు. ఫిర్యాదుల కోసం స్టేషన్ ముందు టెంట్ ఏర్పాటు చేశారు. మాస్క్ లేనివారి వెనక్కి పంపుతున్నారు. సామాజిక దూరం పాటించే విధంగా చూస్తున్నారు.