Jaya Bachchan : ఇటీవల చాలా మంది సెలబ్రిటీలకు కరోనా సోకుతుంది. కరోనా థర్డ్ వేవ్ సెలబ్రిటీలని వదలట్లేదు. అన్ని సినీ పరిశ్రమలలో పలువురు ప్రముఖులు ఈ సారి కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే కొంతమంది కోలుకోగా, మరి కొంతమంది ఐసోలేషన్ లో ఉన్నారు. తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ భార్య జయా బచ్చన్ కరోనా బారిన పడ్డారు.
అమితాబ్ బచ్చన్ సతీమణి, ప్రముఖ నటి జయా బచ్చన్ కోవిడ్ బారిన పడ్డారు. గతేడాది అమితాబ్, అభిషేక్లతో పాటు ఐశ్వర్య, ఆరాధ్యలు ఇలా కుటుంబం అంతా కరోనా బారిన పడ్డారు. కానీ ఆ సమయంలో జయాబచ్చన్ కి మాత్రం కరోనా సోకలేదు. తాజాగా ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న జయా బచ్చన్ కి జరిపిన కోవిడ్ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది.
PM Modi : తెలుగు సినిమాని పొగడ్తలతో ముంచేసిన పీఎం నరేంద్రమోదీ
ప్రస్తుతం ఆమె ఇంట్లోనే హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. జయా బచ్చన్కు కరోనా రావడంతో ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ సినిమా షూటింగ్ను ఆపేశారు. ఆ సినిమా షూటింగ్ లో పాల్గొన్న వాళ్ళని కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాలని జయాబచ్చన్ తెలిపారు.