Minister KTR : 21 రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నాం.. టీఎస్ బిపాస్ దేశంలో ఎక్కడా లేదు : మంత్రి కేటీఆర్

టీఎస్ బిపాస్ దేశంలో ఎక్కడా లేదని.. ఒక్క తెలంగాణలోనే ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 21 రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నామని తెలిపారు.

Minister KTR : టీఎస్ బిపాస్ దేశంలో ఎక్కడా లేదని.. ఒక్క తెలంగాణలోనే ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 21 రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నామని తెలిపారు. ఆదివారం (ఫిబ్రవరి12,2023) శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు మెచ్చుకున్నారని పేర్కొన్నారు. అక్కడక్కడా అనుమతులు లేకుండా లే అవుట్లు వెలుస్తున్న వాటిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.

చట్టాలు తాము రూపొందిస్తామని.. దాన్ని అమలు పర్చాల్సింది అధికారులని తెలిపారు. హౌసింగ్ డిపార్ట్ మెంట్ ను ఇతర శాఖలో విలీనం చేశామని తెలిపారు. హౌసింగ్ బోర్డు కాలనీలు ఉన్నాయని చెప్పారు. ఇండ్లు ఇచ్చిన తర్వాత సొసైటీ ఏర్పాటు చూసుకుని దాని మెయింటనెన్స్ చూసుకోవాలని సూచించారు. ధరణి వచ్చిన తర్వాత చిన్న భూమి కూడా మ్యాప్ చేశామన్నారు. భూములకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొన్నారు.

Hyderabad Metro : మూడేళ్లలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్టు పూర్తి ..టికెట్ ధరలు పెంచితే ఊరుకోం : మంత్రి కేటీఆర్

111జీవోను తొలగించి 69 జీవోను తీసుకొచ్చామని, కేసు హైకోర్టులో ఉందన్నారు. 1920లో నిర్మించిన ఉస్మాన్ సాగర్ నిర్ణయం జరిగిందని చెప్పారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కలుషితం కానివ్వబోమని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. త్వరలో పూర్తి కార్యాచరణ ప్రకటిస్తామని మంత్రి చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు