Seema and Sachin: పాక్ నుంచి అక్రమంగా దేశంలోకి వచ్చిన సీమా హైదర్, ఆమె భాయ్‭ఫ్రెండ్ 2 రోజులుగా మిస్సింగ్

వాస్తవానికి ఆమె ఇండియాలో ప్రవేశించిన అనంతరమే.. ఆమెతో సహా ప్రియుడు సచిన్, అతడి తండ్రి నేత్రపాల్‌ను విదేశీయుల చట్టం కింద యూపీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ముగ్గురూ బెయిల్‌పై విడుదలయ్యారు.

Seema and Sachin: పబ్‭జీ పరిచయం ప్రేమగా మారి భారతీయ ప్రియుడి కోసం పాకిస్తాన్ వదిలేసి అక్రమంగా భారతదేశంలో అడుగుపెట్టిన సీమా గులాం హైదర్ గత రెండు రోజులుగా కనిపించడం లేదట. ఆమెనే కాకుండా ఆమె బాయ్ ఫ్రెండ్ సచిన్ మీనా కూడా కనిపించడం లేదట. గ్రేటర్ నోయిడాలోని వారి ఇంట్లో ఈ ఇద్దరూ రెండు రోజులుగా కనిపించడం లేదని ఇరుగుపోరుగు వారు తెలిపారు. దీంతో ఉత్తరప్రదేశ్ యాంటీ-టెర్రరిస్ట్ స్వార్డ్ (ఏటీఎస్) అలర్ట్ అయింది. ఇక వెంటనే ఆమె భారత్‭లోకి ప్రవేశించిన మార్గంతో పాటు, ఉగ్రవాద సంఘాలతో ఆమెకు ఉన్న సంబంధాలపై దర్యాప్తు ప్రారంభించింది.

Elon Musk-Zuckerberg : బీచ్‌లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఎలన్ మస్క్,జుకర్ బర్గ్.. దీనిపై మస్క్ ఏమన్నారంటే..

వాస్తవానికి ఆమె ఇండియాలో ప్రవేశించిన అనంతరమే.. ఆమెతో సహా ప్రియుడు సచిన్, అతడి తండ్రి నేత్రపాల్‌ను విదేశీయుల చట్టం కింద యూపీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ముగ్గురూ బెయిల్‌పై విడుదలయ్యారు. ఇకపోతే.. నాలుగైదు రోజుల నుంచి గ్రేటర్ నోయిడాలో వీరు ఉంటున్న ఇంటి చుట్టూ స్థానిక పోలీసులు కాపలాగా ఉన్నారు. గత 4-5 రోజులుగా ఈ జంటను చూడలేదని గ్రామంలోని పొరుగువారు, ఇతరులు చెబుతున్నారు. భారతదేశంలోకి హైదర్ ప్రవేశానికి సంబంధించిన వివరాలపై ఏటీఎస్ దర్యాప్తు కేంద్రీకృతమై ఉంది. సీమా, ఆమె నలుగురు పిల్లల పాస్‌పోర్టులు సహా ఆమె ఉపయోగించిన మొబైల్ ఫోన్‌లను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు.

TSRTC: పల్లె వెలుగు ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్”

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. తాను, సచిన్ ఖాట్మండులో కలుసుకున్నారని.. అక్కడే ఉన్న పశుపతినాథ్ ఆలయంలో వివాహం చేసుకున్నారని సీమా చెప్పారు. సచిన్‌కు పాస్‌పోర్ట్ లేకపోవడంతో సీమా ఇండియాకు రావాలని నిర్ణయించుకుందట. పాకిస్తాన్‌ పరిస్థితులు తీవ్ర గందరగోళంగా ఉన్నప్పటికీ, సీమా తన నలుగురు పిల్లలతో కలిసి కరాచీ నుండి ఖాట్మండు చేరుకోగలిగింది. అనంతరం నేపాల్ రాజధానిలో సచిన్‌ను కలుసుకుంది. సీమా పిల్లలను కూడా సచిన్ అంగీకరించాడు. ఇక సరిహద్దు పోలీసులు సీమాను అరెస్ట్ చేసిన అనంతరం, ఆమెకు బెయిల్ మంజూరు చేస్తున్న సమయంలో జెవార్ సివిల్ జడ్జి అయితన జస్టిస్ నజీమ్ అక్బర్ స్పందిస్తూ.. ‘ఏ తప్పుడు ఉద్దేశ్యంతో సీమా భారతదేశంలోకి ప్రవేశించలేదు’ అని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు