High Court Notice RBI Governor : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మహేశ్ బ్యాంక్ కేసులో ఆదేశాలు పాటించలేదని హైకోర్టు నోటీసులో పేర్కొంది. గతంలో పాలనా వ్యవహారాల అధికారిని నియమించాలని ఆర్బీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ ఆదేశాలను ఆర్బీఐ అమలు చేయలేదని వాటాదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆర్బీఐ గవర్నర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జులై 7వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ఆర్బీఐని హైకోర్టు ఆదేశించింది.