NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని దర్శకుడు కొరటాల దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అఫీషియల్గా అనౌన్స్ చేసిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను ఎప్పుడెప్పుడు మొదలుపెడతారా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో తారక్ ఎలాంటి పాత్రలో నటిస్తాడా.. ఈ సినిమాను కొరటాల ఎలాంటి కథతో తీసుకొస్తున్నాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
NTR30: కొరటాల-ఎన్టీఆర్ సినిమా ఆగిపోయిందా.. తారక్ షాకింగ్ డెసిషన్!
ఇక ఈ సినిమా ఆలస్యానికి ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో జాప్యమే కారణమని తెలుస్తోంది. వీటిలో ఈ సినిమాలో నటించే హీరోయిన్ కూడా ఇంకా ఫిక్స్ కాకపోవడం ఒక అంశంగా తెలుస్తోంది. అయితే తొలుత ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ను హీరోయిన్గా తీసుకోవాలని చూసినా, అమ్మడికి పెళ్లయిపోవడంతో ఇప్పుడు వేరకొ హీరోయిన్ కోసం కొరటాల వెతుకుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా ఫిక్స్ అయ్యిందనే వార్తలు జోరుగా వినిపించాయి.
NTR30: ఎన్టీఆర్ సినిమాపై సస్పెన్స్ వీడేది ఎప్పుడు..?
కానీ.. ఇప్పుడు ఈ సినిమాలో వేరొక హీరోయిన్ను ఎంపిక చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ అయతే పర్ఫెక్ట్గా యాప్ట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. అందుకే ఈ సినిమాలో తారక్ సరసన ఆమెను హీరోయిన్గా ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.