Dhanush: సందీప్ కిషన్ తో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తుంటా.. తమిళ్ హీరో ధనుష్!

తమిళ్ హీరో ధనుష్ ప్రస్తుతం 30వ దశకం నేపథ్యంలో ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేయబోతున్నాడు. "కెప్టెన్ మిల్లర్" అనే టైటిల్ ని ఖరారు చేసుకున్న ఈ సినిమాకు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ ఈ సినిమాలో ధనుష్ కి జంటగా నటిస్తుండగా, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. సందీప్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుపుతూ..

Dhanush: తమిళ్ హీరో ధనుష్ ప్రస్తుతం 30వ దశకం నేపథ్యంలో ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా చేయబోతున్నాడు. “కెప్టెన్ మిల్లర్” అనే టైటిల్ ని ఖరారు చేసుకున్న ఈ సినిమాకు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ధనుష్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కబోతున్నా ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.

Dhanush – Aishwarya : విడాకుల తర్వాత పిల్లల కోసం మొదటిసారి కలిసిన ధనుష్ – ఐశ్వర్య.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో..

గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ ఈ సినిమాలో ధనుష్ కి జంటగా నటిస్తుండగా, టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. సందీప్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. “ధనుష్ అన్న నాకు ఇన్స్పిరేషన్, అలాంటిది అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. థ్యాంక్ యూ అరుణ్ నాకు ఈ సినిమాల్లో భాగం కలిపించినందుకు” అంటూ ట్వీట్ చేశాడు.

ఇందుకు ధనుష్ స్పందిస్తూ.. “థ్యాంక్ యూ సందీప్ ఈ సినిమాలో భాగమవుతున్నందుకు. నీతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది, నీతో కలిసి పని చేయడానికి ఎదురు చూస్తుంటా” అంటూ సందీప్ కి బదులిచ్చాడు. అక్టోబర్ మొదటివారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుండగా, జీ వి ప్రకాష్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు