Leo
Leo Movie : లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ నటించిన చిత్రం లియో. ఈ సినిమాలో త్రిష హీరోయిన్. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ కలెక్షన్ల దూకుడు కొనసాగిస్తోంది. ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్గా రూ.450 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. రూ.500 కోట్ల కబ్లో అడుగుపెట్టేందుకు ఉరకలు వేస్తోంది. అయితే.. లియో సినిమా స్క్రీనింగ్ అవుతుండగా ఓ వ్యక్తి థియేటర్ లో స్ర్కీన్ ను చింపివేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. విజయ్ సినిమాపై కోపంతో ఇలా చేశారా..? లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. అయితే.. ఎగ్జిబిటర్కు నష్టాలు రావడంతోనే చింపివేశారని నెట్టింట వైరల్ అవుతోంది. సినిమాకు కలెక్షన్లు బాగానే వస్తుంటే ఇంకా నష్టాలు ఎలా వస్తాయని అభిమానులు అంటున్నారు. కాగా.. అతను గతంలో యూఎస్లోని ప్రముఖ పంపిణీదారు అయిన ఫార్స్ ఫిల్మ్స్ ద్వారా నష్టపోయి ఉండవచ్చునని ఆ కోపంతోనే ఇలా చేశారని అంటున్నారు.
Also Read: అల్లు అర్జున్, సాయి పల్లవి పై రాప్ సాంగ్ విన్నారా.. బాలీవుడ్లో రీ సౌండ్ వస్తుంది..
లియో గురించి మరిన్ని..
‘మాస్టర్’ తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్ల కాంబినేషన్లో లియో చిత్రం తెరకెక్కింది. యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమాకి లోకేష్, రత్న కుమార్, దీరజ్ వైద్యుడు స్క్రీన్ ప్లే అందించారు. సంజయ్ దత్, అర్జున్ సర్జా, మిస్కిన్, శాండీ, గౌతమ్ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్, పలువురు సహాయక పాత్రల్లో కనిపించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు.
BREAKING:
An angry person tore the screen of Joseph Vijay’s #Leo in the middle of screening in USA.pic.twitter.com/yPySkB3Y0K
Shocking…
— Manobala Vijayabalan (@ManobalaV) October 25, 2023
Also Read: పవన్, కొడాలి ఫ్యాన్స్ వార్ మధ్యలో అనసూయ.. ఏమన్నదంటే..?