Mahua Moitra : తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యురాలు మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సంచలన ఆరోపణలు చేశారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడగడానికి మహువా మొయిత్రా లంచం తీసుకున్నారని బీజేపీ ఎంపీ ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తాజాగా లోక్సభ స్పీకర్కు లేఖ రాశారు.
Also Read :Israel-Hamas Conflict Horror : గాజాలో పెరిగిన మృతుల సంఖ్య, ఐస్క్రీం ట్రక్కుల్లో మృతదేహాలు
‘‘నగదు, బహుమతులకు బదులుగా పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి మహువా మోయిత్రాకు ఒక వ్యాపారవేత్త మధ్య లంచాలు మారాయి’’ అని నిషికాంత్ దూబే ఆరోపించారు. ఎంపీ మహువా మొయిత్రాను వెంటనే సభ నుంచి సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు రెండు పేజీల లేఖను దూబే రాశారు.
Also Read :Israel-Gaza war : నీటి కొరతతో రోజుల తరబడిగా స్నానం చేయని గాజా వాసులు
‘‘పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడల్లా, మహువా మొయిత్రా,సౌగతా రాయ్ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం అలవాటు చేసుకున్నదన్నారు. ఇటీవలి వరకు ఆమె లోక్సభలో అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు అదానీ గ్రూప్పై దృష్టి సారించినవేనని దూబే లేఖలో పేర్కొన్నారు.
Also Read :Israel Palestine Conflict: ఇజ్రాయెల్ జెండా మీదుంటే నీలి నక్షత్రం ఏంటో తెలుసా?
మహూవా మోయిత్రా లోక్సభలో ప్రశ్నలు అడగడానికి బదులుగా వ్యాపారవేత్త నుంచి డబ్బు వసూలు చేశారని, మరో వ్యాపార బృందాన్ని లక్ష్యంగా చేసుకున్నారని దూబే ఆరోపించారు. మహువా మొయితాకు ఫైర్బ్రాండ్ పార్లమెంటు సభ్యురాలు అనే బిరుదు బూటకం తప్ప మరేమీ కాదని ఆయన అన్నారు.