Kohli : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసిన రోజు వచ్చేసింది. భారత్ వేదికగా గురువారం నుంచి వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభమైంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మొదటి మ్యాచులో ఇంగ్లాండ్ పై న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఇక ప్రపంచకప్లో టీమ్ఇండియా తన తొలి మ్యాచ్ను ఆగస్టు 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. చెన్నైలోని చిదరంబరం స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ఇప్పటికే చెన్నైకి చేరుకుని ప్రాక్టీస్ మొదలెట్టాయి.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కాగా.. అతడిని కలిసేందుకు వీల్చైర్లో ఉన్న ఓ అభిమాని టీమ్ఇండియా ప్రాక్టీస్ చేస్తున్న మైదానం వద్దకు వచ్చాడు. అతడిని గమనించిన విరాట్ కోహ్లీ నేరుగా అతడి వద్దకు వచ్చాడు. అతడి చేతిలో ఉన్న తన డ్రాయింగ్ ఫోటోను చూసి దానిపై ఆటోగ్రాఫ్ కావాలా అని అతడిని అడిగి మరీ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అంతేనా అతడితో కలిసి ఫోటోలు దిగాడు. దీంతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కోహ్లీ మాత్రమే కాదు శ్రేయస్ అయ్యర్ సైతం అతడితో ఫోటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Shreyas Iyer took a picture with a special fan who came to meet players.
A lovely gesture by Shreyas! pic.twitter.com/CcVEcl2Owg
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 5, 2023
దీనిపై సదరు అభిమాని అయిన చెన్నైకి చెందిన శ్రీనివాసన్ మాట్లాడుతూ.. తాను ప్రపంచకప్ టికెట్లు కొనేందుకు మైదానం వద్దకు వచ్చినట్లు చెప్పాడు. ఎట్టకేలకు విరాట్ కోహ్లీని కలిశానని వెల్లడించాడు. ‘విరాట్ నా వద్దకు వచ్చారు. తన డ్రాయింగ్ ఫోటోపై ఆటోగ్రాఫ్ కావాలా అని అడిగి మరీ ఇచ్చాడు. నేను ఆశ్చర్యపోయాడు. ఇది ఓ కలలా అనిపించింది. ఈ క్షణాన్ని నేను నా జీవితంలో మరిచిపోలేను. విరాట్ కోహ్లీ చాలా దయగల వాడు.’ అని శ్రీనివాసన్ అన్నాడు.
ODI World Cup-2023: మ్యాచులు చూడడానికి వెళ్లే ప్రేక్షకులకు బీసీసీఐ గుడ్న్యూస్
#WATCH | Tamil Nadu: “I came here to buy the tickets for the Cricket World Cup…Eventually, I met Virat Kholi & he came right to me and asked me – you want me to sign on this… I was super anxious… It was a dream come true moment. We took photographs. He was super kind…,”… pic.twitter.com/xX2ROaH5vR
— ANI (@ANI) October 5, 2023