Railway Teacher Recruitment : రైల్వే డిపార్ట్‌మెంట్ పరిధిలోని స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 18-65 మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ విధానంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి 21,250 నుండి 27,500 వరకు జీతాన్ని పొందొచ్చు.

Railway Teacher Recruitment : మహారాష్ట్ర లోని భుసావల్ డివిజన్‌ పరిధిలోని రైల్వే డిపార్ట్‌మెంట్ పరిధిలోని స్కూళ్లలో ఉపాధ్యయపోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. భర్తీ చేయనున్న వాటిలో 5 పీజీటీ పోస్టులు, 8 టీజీటీ పోస్టులు, 9 పీఆర్‌టీ పోస్టులు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 18-65 మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ విధానంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి పోస్టును బట్టి 21,250 నుండి 27,500 వరకు జీతాన్ని పొందొచ్చు. అభ్యర్ధులు 04 అక్టోబర్ 2022న భుసావల్‌లోని డీఆర్‌ఎం కార్యాలయంలో జరిగే ఇంటర్యూకు అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్లతోపాటు వాటికి సంబంధించిన అటెస్టెడ్ జిరాక్స్ సెట్‌తో నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://cr.indianrailways.gov.in/ పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు