Ayodhya Ram Mandir
CM Yogi Adityanath : ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ తో పాటు ఆ రాష్ట్ర మంత్రులు, బీజేపీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలందరూ ప్రత్యేక బస్సుల ద్వారా అయోధ్యకు వెళ్లారు. అయోధ్య రామాలయాన్ని సందర్శించి రామ్ లల్లాను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి ఆధిత్యనాథ్ పూణె నుండి అయోధ్యకు విమానంలో చేరుకున్నారు. వీరితోపాటు అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా, ఆర్ఎల్డీ, బీఎస్పీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక బస్సుల్లో తరలివచ్చి రామ్ లల్లాను దర్శించుకున్నారు. యూపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రత్యేక బస్సుల్లో బయలుదేరారు. కాన్వాయ్ ఉదయం 9గంటలకు లక్నో నుంచి బయలుదేరి.. ఉదయం 11.30 గంటలకు అయోధ్యకు చేరుకుంది. అనంతరం రామ మందిరాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రామ్ లల్లాను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.
Also Read : రెండు నెలలు ఓపిక పట్టండి.. వచ్చేది మన ప్రభుత్వమే.. ప్రతియేటా డీఎస్సీ నిర్వహిస్తాం
అయోధ్యకు చేరుకోగానే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం లభించింది. అంతకుముందు దారిపొడవునా స్థానిక ప్రజలు బస్సులపై పూల వర్షం కురిపించి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. బుల్డోజర్లు ఎక్కి మరీ ప్రజాప్రతినిధులు వెళ్తున్న బస్సులపై ప్రజలు పూల వర్షం కురిపించించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ బృందంలో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, వారి బృందం పాల్గొనలేదు.
#WATCH | Uttar Pradesh: People shower flower petals on Uttar Pradesh Ministers and MLAs visiting Shri Ram Janmabhoomi temple in Ayodhya. pic.twitter.com/N11uAppzGU
— ANI (@ANI) February 11, 2024
#WATCH | Uttar Pradesh CM Yogi Adityanath, Assembly Speaker Satish Mahana, Deputy CMs KP Maurya, Brajesh Pathak and members of the UP Assembly & Legislative Council at Ayodhya's Ram Janmabhoomi Temple. pic.twitter.com/twXRA8T2OK
— ANI (@ANI) February 11, 2024