Dolly Sohi : బాలీవుడ్ సీరియల్ నటి డాలి సోహి.. కలష్, పరిణీతి, కుంకుమ భాగ్య, జనక్, బాబీ.. లాంటి సూపర్ హిట్ సీరియల్స్ తో ప్రేక్షకులని గత 20 ఏళ్లుగా మెప్పిస్తుంది. కొన్నాళ్ల క్రితం తనకు సర్వైవల్ క్యాన్సర్ వచ్చిందని తెలిపింది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటుంది డాలి సోహి. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటూనే నేడు ఉదయం డాలి సోహి ముంబైలోని అపోలో హాస్పిటల్ లో మరణించింది.
అయితే ఆ కుటుంబానికి మరో విషాదం కూడా ఒకేసారి వచ్చింది. డాలి సోహి మరణించే కొన్ని గంటల ముందే ఆమె సొంత సోదరి అమన్ దీప్ సోహి కూడా మరణించింది. గత కొన్ని రోజులుగా కామెర్లతో బాధపడుతున్న అమన్ దీప్ కూడా ముంబైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ నిన్న రాత్రి మరణించింది.
Also Read : Dhanush : మహా శివరాత్రి నాడు ‘కుబేర’.. బిచ్చగాడిలా ధనుష్..
కొన్ని గంటల వ్యవధిలోనే అక్కాచెల్లెళ్లు మరణించడంతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఈ విషయం తెలిసిన డాలి సోహి అభిమానులు, నెటిజన్లు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఇద్దరికీ నివాళులు అర్పిస్తున్నారు. ఇలా కొన్ని గంటల వ్యవధిలోనే అక్కాచెల్లెళ్లు మరణించడంతో ఈ వార్త వైరల్ గా మారింది.