TeamIndia: సొంతగడ్డపై వరుసగా 14వ విజయం నమోదు చేసింది టీమిండియా. ఇదిలా ఉంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 11వ టెస్టు సిరీస్ విజయం దక్కింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ పై బెంచ్ ప్లేయర్లను వాడి గెలిచేశారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, బుమ్రా, షమీలు సిరీస్ మిస్ అయినప్పటికీ గెలుపు మనదే కావడం విశేషం.
ఇన్నేళ్లుగా టీమిండియా న్యూజిలాండ్ పై 14సార్లు ఒక్కసారి కూడా ఓటమి చూడలేదు. రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ పార్టనర్ షిప్ లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను బాదేశారు. అంతకంటే ముందు టీ20 సిరీస్ లోనూ కివీస్ కు పరాభవం తప్పలేదు.
ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో టెస్ట్లో భారత్ 372 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 540రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 167 పరుగులకే ఆలౌట్ అయ్యింది. హెన్రీ నికోల్స్ను పెవిలియన్కు పంపడం ద్వారా రవిచంద్రన్ అశ్విన్ న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ను ముగించాడు.
……………………………… త్రిష కాదు తమ్మూ.. హీరోయిన్ కోసం ఇండియన్ వేట!
రెండో ఇన్నింగ్స్లో మెరుగైన ప్రదర్శన కనబరిచిన టీం ఇండియా, న్యూజిలాండ్కు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది. న్యూజిలాండ్ జట్టు 57 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. భారత్ తరఫున రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు తీశారు. అక్షర్ పటేల్కు ఒక వికెట్ దక్కింది. ఓ కివీ బ్యాట్స్ మన్ రనౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా 1-0 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది.
ఈ టెస్టు మ్యాచ్లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మయాంక్ అగర్వాల్ సెంచరీ, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీతో భారత జట్టు 325 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరపున, అజాజ్ పటేల్ 10 వికెట్లు పడగొట్టి రికార్డు క్రియేట్ చేశాడు. భారత బ్యాట్స్మెన్లందరినీ అవుట్ చేశాడు అజాజ్ పటేల్. అయితే, న్యూజిలాండ్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 62 పరుగులకే ఆలౌట్ అయి నిరాశపరిచారు. భారత్ తరఫున అశ్విన్ 4 వికెట్లు, మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు, జయంత్ యాదవ్ ఒక వికెట్ తీశారు.
Nalgonda : జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
తొలి ఇన్నింగ్స్లో 263 పరుగుల ఆధిక్యం సాధించిన తర్వాత, మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీలు, ఛెతేశ్వర్ పుజారా, శుభ్మాన్ గిల్ల 47-47 పరుగులు, అక్షర్ పటేల్ 41 పరుగులు మరియు కెప్టెన్ విరాట్ కోహ్లీ 36 పరుగులు చేసింది. 7 వికెట్ల నష్టానికి 276 పరుగుల స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఈ ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ తరఫున అజాజ్ పటేల్ 4 వికెట్లు తీయగా, రచిన్ రవీంద్ర 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో అజాజ్ పటేల్ 14 వికెట్లు పడగొట్టాడు. భారత్ మొత్తం 539 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో ఫాలోఆన్ను కూడా కాపాడుకోలేకపోయింది. అయితే రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం సముచితమని భారత్ భావించింది. మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీ, ఛెతేశ్వర్ పుజారా, శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్, కెప్టెన్ విరాట్ కోహ్లీ రాణించడంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ఈ విధంగా, కివీ జట్టు ముందు భారత్ 540 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది, అయితే న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ కూడా తడబడింది. 167 పరుగులకే ఆలౌట్ అయింది.
Anti-Maoist Posters : మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్పోస్టర్లు,కరపత్రాలు
రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ ఇన్నింగ్స్ కు బ్యాక్ బోన్ గా నిలిచిన సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్(150)ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వరించింది. రెండో టెస్టులో 8 వికెట్లతో పాటు.. 2 టెస్టుల్లో మంచి ప్రదర్శన చేసిన భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డ్ దక్కింది.
రెండో టెస్ట్ స్కోర్ బోర్డు
ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్ 325 ఆలౌట్
న్యూజీలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ 62 ఆలౌట్
ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ 276/7
న్యూజీలాండ్ సెకండ్ ఇన్నింగ్స్ 167 ఆలౌట్
372 రన్స్ భారీ తేడాతో కోహ్లీ గ్యాంగ్ ఘనవిజయం.