Directors Day : డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ డేట్ మారింది.. స్టార్ డైరెక్టర్స్ స్పెషల్ పర్ఫార్మెన్స్‌లతో భారీగా ఎప్పుడంటే..

మే 4న దాసరి నారాయణరావు పుట్టిన రోజు పురస్కరించుకొని LB స్టేడియంలో ఘనంగా డైరెక్టర్స్ డే చేస్తారని ఇటీవల ప్రకటించారు.

Directors Day : దర్శకరత్న దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం మే 4న డైరెక్టర్స్ డే జరుపుకుంటారు. గతంలో ఓ సారి డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా చేశారు. కరోనా నుంచి మళ్ళీ చేయలేదు. ఇటీవల డైరెక్టర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడటంతో చాలా యాక్టివ్ గా ఉంటూ అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మే 4న దాసరి నారాయణరావు పుట్టిన రోజు పురస్కరించుకొని LB స్టేడియంలో ఘనంగా డైరెక్టర్స్ డే చేస్తారని ఇటీవల ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమలోని డైరెక్టర్స్ తో పాటు హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీలు రావాల్సి ఉంది. అయితే కొంతమంది డైరెక్టర్స్, సెలబ్రిటీలు నేడు మే 4న అందుబాటులో లేకపోవడంతో ఈ డేట్ ని మార్చారు. నేడు సింపుల్ గా దాసరిని స్మరిస్తూ ఆయనకు నివాళులు అర్పించి, కేక్ కట్ చేసి డైరెక్టర్ డే సెలబ్రేట్ చేసుకున్నారు డైరెక్టర్స్ యూనియన్ ఆధ్వర్యంలో. అనంతరం ఓ ప్రెస్ మీట్ నిర్వహించి డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా మే 19న LB స్టేడియంలో సాయంత్రం 6 గంటల నుండి సెలబ్రేట్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్ లో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు అనిల్ రావిపూడి, వశిష్ట, గోపీచంద్ మలినేని, విజయ్ కనకమేడల, శంకర్, రేలంగి నరసింహారావు, డైరెక్టర్ యూనియన్ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

Also Read : Anil Ravipudi : ఐపీఎల్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి.. నేను మాట్లాడింది అపార్థం చేసుకోవద్దు..

మే 19న జరగబోయే గ్రాండ్ సెలబ్రేషన్స్ లో చాలా మంది డైరెక్టర్స్ స్కిట్స్, డ్యాన్సులు.. ఇంకా చాలా పర్ఫార్మెన్స్ లు చేయబోతున్నట్టు తెలిపారు. విజయ్ కనకమేడల, అనుదీప్ ఇప్పటికే స్కిట్స్ రాసినట్టు, గోపీచంద్ మలినేని బాలయ్య బాబు డైలాగ్స్ చెప్పనున్నట్టు, అనిల్ రావిపూడి, శ్రీరామ్ ఆదిత్య, పలువురు డైరెక్టర్స్ డాన్స్ చేయబోతున్నట్టు, నందిని రెడ్డి స్కిట్ వేయబోతున్నట్టు.. ఇంకా చాలా మంది డైరెక్టర్స్ స్పెషల్ పర్ఫార్మెన్స్ లు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. ఇలా తొలిసారిగా డైరెక్టర్స్ అంతా ఒకే చోట చేరి సెలబ్రేట్ చేయబోతుండటమే కాక వాళ్ళు కూడా పర్ఫార్మెన్స్ లు చేస్తున్నట్టు ప్రకటించడంతో ఈ ఈవెంట్ పై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు