Ananthapur : పోలీసులమని బెదిరించి రూ.2 కోట్లు దోచుకెళ్లిన హైవే దొంగలు, అనంతపురంలో ఘరానా మోసం

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. Ananthapuramu - Fake Police

Ananthapuramu - Fake Police

Ananthapur – Fake Police : ఇది అలాంటి ఇలాంటి మోసం కాదు.. ఘరానా మోసం. దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసుల పేరు వాడుకున్నారు. పోలీసులం అంటూ బరితెగించారు. 2 కోట్ల రూపాయలు దోచుకెళ్లారు.

అనంతపురంలో ఘరానా మోసం వెలుగుచూసింది. పోలీసులమని బెదిరించి 2 కోట్ల రూపాయలు దోచుకెళ్లారు హైవే దొంగలు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. గార్లదిన్నె మండలం కనంపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై నిన్న (ఆగస్టు 22) రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

కారును రోడ్డుకు అడ్డంగా ఆపిన దొంగలు.. మేము పోలీసులం అంటూ బిల్డప్ ఇచ్చారు. రోడ్డుపై వస్తున్న ఓ వాహనాన్ని ఆపారు. మీరు రోడ్డు యాక్సిడెంట్ చేసి వస్తున్నారంటూ డ్రైవర్ ని దబాయించారు నకిలీ పోలీసులు. పోలీసులు అని చెప్పడంతో వారు భయపడ్డారు. గట్టిగా మాట్లాడలేకపోయారు. మేము ఎక్కడా యాక్సిడెంట్ చేయలేదని చెప్పినా నకిలీ పోలీసులు వినలేదు. వాహనంలో ఎక్కించుకెళ్లారు నకిలీ పోలీసులు. కాస్త దూరంపోయాక వారిని రోడ్డు పక్కన దింపేసి 2 కోట్ల రూపాయలతో ఉడాయించారు నకిలీ పోలీసులు. వాళ్లు నిజమైన పోలీసులు కాదని, తాము మోసపోయామని తెలిసి బాధితులు షాక్ కి గురయ్యారు.

Also Read: ఓ మై గాడ్.. బిర్యానీ కోసం ఘర్షణ, నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య.. వీడియో వైరల్

అనంతపురము నగరంలోని యస్ఆర్ కన్‌స్ట్రక్షన్‌లో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు బెంగళూరు నుంచి ఆఫీస్ డబ్బు 2 కోట్ల రూపాయలు తీసుకుని హైదరాబాద్ బయలుదేరారు. రాత్రి 7 గంటలకు అనంతపురము మీదుగా హైదరాబాద్ కు కారులో వెళ్తున్నారు. ఇంతలో రాత్రి 7-30 గంటలకు గార్లదిన్నె మండలం కనంపల్లి వద్ద ఘరానా మోసం జరిగింది.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఈ ఘటన తీవ్ర సంచలనం రేపడంతో స్వయంగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. ఈ కేసుని సవాల్ గా తీసుకున్నారు. నకిలీ పోలీసుల కోసం ప్రత్యేక టీమ్స్ తో గాలింపు చేపట్టారు.

Also Read..Viral Video : భయానక దృశ్యం.. వేగంగా వస్తున్న బస్సు కింద ఎలా పడ్డాడో చూడండి.. వీడియో వైరల్

ట్రెండింగ్ వార్తలు