Tirumala – Justice NV Ramana : తిరుమల కొండలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. స్వచ్ఛ తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమంలో మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
తిరుమల కొండలను ప్లాస్టిక్, వ్యర్ధ రహిత ప్రాంతంగా ఉంచడానికి స్వచ్ఛ తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమాన్ని ప్రారంభించామని ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. రెండు ఘాట్ రోడ్లు, రెండు నడక మార్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు.
భక్తులు ప్లాస్టిక్ వ్యర్ధాలను బయటి ప్రదేశాల్లో పడ వేయకుండా టీటీడీకి సహకరించాలని కోరారు. ప్రతి నెల రెండవ శనివారం స్వచ్ఛ తిరుమల-శుద్ధ తిరుమల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.