Pawan Kalyan: వైసీపీ నేతల దూషణలను ఆహ్వానిస్తున్నా.. నేను చేతలతో బదులిస్తా చూడు..: పవన్ వార్నింగ్

మీసాలు మెలేయడం, తొడ కొట్టడాలు వంటివి తాను సినిమాల్లో కూడా చేయనని పవన్ చెప్పారు.

Pawan Kalyan

Pawan Kalyan – JanaSena: వైసీపీ (YCP) నేతల దూషణలను ఆహ్వానిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కాకినాడ జిల్లా(Kakinada district)లోని పిఠాపురం, గొల్లప్రోలులో వారాహి విజయ యాత్ర(Varahi Vijaya Yatra)లో ఆయన మాట్లాడారు.

ఈ యాత్రలో జనసేన నేత నాగబాబు కూడా పాల్గొన్నారు. తమపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. మీసాలు మెలేయడం, తొడ కొట్టడాలు వంటివి తాను సినిమాల్లో కూడా చేయనని పవన్ కల్యాణ్ చెప్పారు. వైసీపీ నేతల మాటలకు తాను చేతలలో బదులిస్తానని తెలిపారు. చింతిస్తున్నాము అని వారితోనే చెప్పిస్తానని సవాలు విసిరారు.

Pawan Kalyan: భవిష్యత్తులో వైసీపీని ఎదుర్కొనేది జనసేన పార్టీ మాత్రమే.. ఎలాగంటే?: పవన్ కల్యాణ్

తాము ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని పవన్ చెప్పారు. గతంలో వైజాగ్ లో డాక్టర్ సుధాకర్ ని వైసీపీ నేతలు పిచ్చోడిని చేశారని అన్నారు. కాకినాడలో ప్రశ్నించినందుకు ఒక మహిళ మానసిక స్థితి బాగోలేదని చెబుతున్నారని తెలిపారు. ఇక్కడి చెరువుల్లో మట్టిని కూడా తవ్వేస్తున్నారని తెలిపారు. తాను సీరియస్ గా రాజకీయాలు చేస్తున్నానని చెప్పారు.

జనసేన కార్యకర్త మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ జనసేన కార్యకర్త మృతి చెందాడు. గత రాత్రి కత్తిపూడిలో పవన్ కల్యాణ్ నిర్వహించిన సభకు వచ్చి బైక్ పై తిరిగి వెళ్తుండగా పాయకరావు పేట సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొని జనసేన కార్యకర్త చందక బంగారు రాజు మృతి చెందాడు. మృతుడు అల్లూరి సీతారామ రాజు జిల్లా కొయ్యూరు మండలం బాలారం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. తుని ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.

BRS: బీఆర్ఎస్ నేతలకు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో రూపంలో మాట్లాడిన ఎమ్మెల్యే జోగురామన్న

ట్రెండింగ్ వార్తలు