Bimbisara : కల్యాణ్ రామ్ హీరోగా, కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించిన సినిమా ‘బింబిసార’. వశిష్ఠ్ దర్శకత్వంలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది. శుక్రవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. దీనికి ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ వచ్చారు.
ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ”నేను సినిమా చూశాను. కొత్త దర్శకుడైనా చాలా అద్భుతంగా తీశాడు. సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతారు. ప్రస్తుత పరిస్థితుల్లో అద్భుతమైన సినిమాలు చూస్తే తప్ప ప్రేక్షకులు సంతృప్తి చెందడం లేదు. ‘బింబిసార’ అలాంటి అద్భుతమైన సినిమా. మా తాతగారు, మా నాన్నగారు మాకు వదిలి వెళ్లిన అభిమానులు మీరు, మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. మీకు మేము చేసే సినిమాలు నచ్చకపోతే నచ్చే వరకూ చేస్తూనే ఉంటాం. మీరు కాలర్ ఎగరేసుకునే సినిమాలు చేయడం మా బాధ్యత. కల్యాణ్ అన్న కెరియర్ ‘బింబిసార’కి ముందు, తర్వాత అని కచ్చితంగా చెప్తాను. ఈ సినిమాకి కల్యాణ్ రామ్ తప్ప వేరే నటులు ఎవ్వరూ న్యాయం చేయలేరు” అన్నారు.
Theaters : ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ.. అయినా థియేటర్ కి రాని జనం..
అలాగే కొన్ని రోజుల నుంచి థియేటర్స్, టికెట్స్, టాలీవుడ్ సమస్యలు ఉండటం, వాటి మీద చర్చలు జరుగుతుండటం తెలిసిందే. థియేటర్లకు జనాలు రావట్లేదని టాలీవుడ్ వర్గాలు గగ్గోలు పెడుతున్నాయి. దానిపై ఎన్టీఆర్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పందించారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ”అందరూ ఇండస్ట్రీకి గడ్డు కాలం అని, థియేటర్లకి జనాలు రావడం లేదని, ఇంకా ఏవేవో అంటున్నారు. ఇదంతా నేను నమ్మను. అద్భుతమైన మంచి సినిమా వస్తే చూసి, ఆశీర్వదించే గొప్ప హృదయం ఉన్న తెలుగు ప్రేక్షక దేవుళ్లు మీరంతా. ఆగస్టు 5న విడుదలవుతున్న ‘బింబిసార’, అదే రోజు విడుదల అవుతున్న ‘సీతా రామం’ సినిమాలని ఆదరించి తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఊపిరి పోయాలి. ఇండస్ట్రీ పదికాలాల పాటు చల్లగా ఉండి మీ అందర్నీ అలరించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను” అని అన్నారు. దీంతో ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.